విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారి నాగవైష్ణవి దారుణ హత్య కేసు: ముగ్గురు నిందితులకు జీవితఖైదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: 2010 జనవరి 30వ తేదీన దారుణ హత్యకు గురైన చిన్నారి నాగవైష్ణవి కేసులో ముగ్గురు దోషులకు విజయవాడ మహిళా న్యాయస్థానం గురువారం జీవిత ఖైదువిధించింది. ఈ హత్య కేసులో పంది వెంకట్రావు, మోర్ల శ్రీనివాస్, వెంపరాల జగదీష్‌లకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

ఎనిమిదేళ్ల క్రితం విజయవాడలో సంచలనం నాగవైష్ణవి హత్య కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కారులో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత బాయిలర్‌లో వేసి దహనం చేశారు. అంతకుముందే కారు డ్రైవర్ లక్ష్మణ రావును నడి రోడ్డుపై దారుణంగా చంపేశారు.

Life sentence for 3 accused in Naga Vaishnavi murder case

నాగవైష్ణవిని హత్య చేసిన విషయం తెలిసి తండ్రి పలగాని ప్రభాకర్ మనోవేధనతో ఆ తర్వాత మృతి చెందారు. ఈ హత్య, మృతి పట్ల కంటతడి పెట్టని వారు లేరు. ఈ కేసులో ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్‌లు ఉన్నారు. వీరు ఏడేళ్ళుగా జైల్లో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. ఇప్పుడు వారికి జీవితఖైదు పడింది.

English summary
Life sentence for 3 accused in Naga Vaishnavi murder case. Naga Vaishnavi killed on January 30, 2010. The victim's dead body was thrown in a furnace of an iron unit, in Vijayawada. A gold earring found at the site, turned important in tracing the culprits. Her father, Prabhakar died instantly, when he heard about the death of his darling daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X