చిన్నారి నాగవైష్ణవి దారుణ హత్య కేసు: ముగ్గురు నిందితులకు జీవితఖైదు
విజయవాడ: 2010 జనవరి 30వ తేదీన దారుణ హత్యకు గురైన చిన్నారి నాగవైష్ణవి కేసులో ముగ్గురు దోషులకు విజయవాడ మహిళా న్యాయస్థానం గురువారం జీవిత ఖైదువిధించింది. ఈ హత్య కేసులో పంది వెంకట్రావు, మోర్ల శ్రీనివాస్, వెంపరాల జగదీష్లకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
ఎనిమిదేళ్ల క్రితం విజయవాడలో సంచలనం నాగవైష్ణవి హత్య కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కారులో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత బాయిలర్లో వేసి దహనం చేశారు. అంతకుముందే కారు డ్రైవర్ లక్ష్మణ రావును నడి రోడ్డుపై దారుణంగా చంపేశారు.

నాగవైష్ణవిని హత్య చేసిన విషయం తెలిసి తండ్రి పలగాని ప్రభాకర్ మనోవేధనతో ఆ తర్వాత మృతి చెందారు. ఈ హత్య, మృతి పట్ల కంటతడి పెట్టని వారు లేరు. ఈ కేసులో ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్లు ఉన్నారు. వీరు ఏడేళ్ళుగా జైల్లో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. ఇప్పుడు వారికి జీవితఖైదు పడింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications