వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ చీఫ్ మినిస్టర్ ముసుగు తీసేసి.. ఫ్యాక్ష‌న్ రెడ్డి గ్యాంగుల నెత్తుటి దాహం : లోకేష్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలపై, కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న టిడిపి నేతల దారుణ హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్ వైయస్ జగన్ చీఫ్ మినిస్టర్ ముసుగు తీసేసి, ఫ్యాక్షనిస్టు నిజరూపాన్ని బయటపెడుతున్నారు అంటూ జగన్ ను టార్గెట్ చేసి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

సినీ ఫక్కలో.. వేట కొడవళ్ళతో నరికి .. కర్నూలులో ఇద్దరు కీలక టీడీపీ నేతల దారుణ హత్యసినీ ఫక్కలో.. వేట కొడవళ్ళతో నరికి .. కర్నూలులో ఇద్దరు కీలక టీడీపీ నేతల దారుణ హత్య

 వేట కొడవళ్లు, కత్తులూ, గొడ్డళ్ళకు పదును పెట్టి పల్లెల్లో వైసీపీ ప్రతీకారాలు

వేట కొడవళ్లు, కత్తులూ, గొడ్డళ్ళకు పదును పెట్టి పల్లెల్లో వైసీపీ ప్రతీకారాలు

ఫ్యాక్షన్ రెడ్డి గ్యాంగులు వేట కొడవళ్లు, కత్తులూ, గొడ్డళ్ళకు పదును పెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయి అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు టిడిపి శ్రేణులు లక్ష్యంగా వైసిపి ఫ్యాక్షన్ ముఠాలు చెలరేగి పోతున్నాయని ఆరోపించిన నారా లోకేష్ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో టిడిపి నాయకులు వడ్డి నాగేశ్వరరెడ్డి , వడ్డి ప్రతాపరెడ్డిలనుకార్లతో ఢీ కొట్టిన వైసీపీ ఫ్యాక్షన్ లీడర్ లు వేట కొడవలితో నరికి చంపారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.

జగన్ రెడ్డి ,ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి ఈ దారుణ మరణాలు సాక్ష్యం

జగన్ రెడ్డి ,ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి ఈ దారుణ మరణాలు సాక్ష్యం

ఈ ఘటన అత్యంత దారుణమని ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారంటూ పేర్కొన్న నారా లోకేష్ మృతులు, వైసిపి బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ,ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి ఈ దారుణ మరణాలు సాక్ష్యం అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఫ్యాక్షన్ ముఠాలు ఆ ఫ్యాక్షన్ కే పోతాయని పేర్కొన్నారు.

Recommended Video

Chandrababu Naidu ఐనా KissMiss Naidu ఐనా వదలను - Kodali Nani
 కర్నూలు టీడీపీ నేతల దారుణ హత్యలపై భగ్గుమన్న టీడీపీ

కర్నూలు టీడీపీ నేతల దారుణ హత్యలపై భగ్గుమన్న టీడీపీ

గ్రామాలలో శాంతి నెలకొల్పడానికి, స్నేహపూర్వక వాతావరణం కల్పించటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధమే అంటూ లోకేష్ పేర్కొన్నారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జరిగిన దారుణ హత్యలపై టిడిపి నాయకులు స్పందిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన గౌరు చరితారెడ్డి, వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. టిడిపి నాయకులను అత్యంత దారుణంగా వేటకొడవళ్లతో హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

English summary
TDP national general secretary Nara Lokesh is outraged over the latest developments in the state of Andhra Pradesh and the brutal killings of TDP leaders in Kurnool district. Responding to the social media platform, Lokesh fired at the Chief Minister YS Jagan revelaing his real factionist face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X