బస్సులుగా లారీలు, నో ఇన్సూరెన్స్, జేసీ ఉమారెడ్డి, గోపాల్ రెడ్డి పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్..
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్తో దివాకర్ ట్రావెల్స్లో జరుగుతోన్న లోపాలకు సంబంధించి మరోసారి చర్చకు దారితీసింది. దివాకర్ ట్రావెల్స్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా రిజిష్ట్రేషన్ చేసుకొని ఏపీలో తిరుగుతున్నారని.. లారీలను కూడా బస్సులుగా మార్చారనే సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి. ఇంతకీ జేసీ ట్రావెల్స్ ఏం చేశాయి. నిబంధనలను ఎలా తుంగలో తొక్కాయి.

160 వాహనాల కొనుగోలు..
దేశంలో బీఎస్-3 వాహనాలకు అనుమతి లేదు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా బీఎస్-4 వాహనాలనే అనుమతిస్తున్నారు. కానీ అప్పటికే జేసీ వద్ద ఉన్న బీఎస్-3 వాహనాలను 4గా మార్చివేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల కన్నా ముందు 160 వాహనాలను జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నాగాలాండ్లో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి.. బీఎస్-4గా రిజిష్ట్రేషన్ చేశారు. ఆ వాహనాలు తిరగడంతో అధికారులు ఆడపా దడపా పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 60 వాహనాలను సీజ్ చేశారు. మిగిలిన 94 వాహనాలను గుర్తించాల్సి ఉంది.
Recommended Video

జేసీ ఉమారెడ్డి పేరుతో..
నాగాలాండ్లో కొనుగోలు చేసిన వాహనాలను జేసీ ఉమారెడ్డి పేరుతో కొన్ని ఉండగా.. మరికొన్ని జఠాధర కంపెనీకి చెందిన సీ గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆర్టీఏ అధికారులు వాహనాలను పట్టుకోవడంతో.. జేసీ అండ్ టీం అప్రమత్తమైందని.. కొందరి వ్యక్తులకు వాహనాలను అప్పగించారని తెలిసింది. మరికొన్ని వాహనాల విడి భాగాలు తొలగించి విక్రయించారని తెలిసింది. మరికొన్నింటినీ బస్సులుగా మార్చారనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్ని వాహనాలకు సంబంధించి టైర్ల నుంచి బ్యాటరీ, ఇంజినీ, బాడీ తొలగించారని తెలుస్తోంది.

బస్సులుగా లారీలు
మొత్తం వాహనాలు 154 నుంచి 160 వరకు ఉన్నాయి. ఇందులో ఆర్టీఏ అధికారులు 60 వాహనాల వరకు సీజ్ చేశారు. మరో 94 వాహనాలను మాత్రం ఎక్కడున్నాయో తెలియరాలేదు. కానీ నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారని వెలుగుచూసింది. జేసీ ట్రావెల్స్ వాహనాల్లో ప్రయాణించేవారికి ఇన్సూరెన్స్ వర్తించదని ఇప్పటికే తెలిపామని అధికారులు చెబుతున్నారు. కానీ ట్రావెల్స్ తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications