బ్రాహ్మణితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్: బాలయ్యకు భయపడిన నారా లోకేష్ ప్రేమ కహానీ
గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో ప్రేమ వ్యవహారం గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆయన తెలిపారు. మంగళగిరిలో విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి.. బ్రాహ్మణితో ప్రేమ విషయంపై ఆయనను ప్రశ్నించారు.
బ్రాహ్మణితో పెళ్లి ప్రతిపాదన మొదటగా ఎవరు తీసుకుని వచ్చారని నారా లోకేష్ను ఆ యువతి ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా ప్రాంగణమంతా కేకలు వేస్తూ కేరింతలు వేశారు యువతీయువకులు. లోకేష్ చుట్టూ సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయంటూ పక్కనే ఉన్న ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు.
ఇక ఈ విషయంపై నారా లోకేష్ స్పందిస్తూ.. 'చెప్పమంటారా..
నాది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా' అని చెప్పారు. దీంతో అక్కడున్నవారంత వావ్ అంటూ కేకలు వేశారు. కానీ, ముద్దుల మామయ్య (నందమూరి బాలకృస్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడని కాదులే అని లోకేష్ చెప్పుకొచ్చారు.

'ఇంట్లో అమ్మా నాన్న వెకేషన్కు వెళితే వాళ్లప్పుడు చెప్పారు. ఇట్లనుకుంటున్నాం.. నీ అభిప్రాయమేంటని.. ఇక నా అభిప్రాయం మీకు తెలుసు కదా.. సో వాళ్లు ముందల ప్రతిపాదించారు.. ఎస్ అన్నాను. బ్రాహ్మిణి కూడా ఒప్పుకుంది. అలా జరిగింపోయింది.. థాంక్యూ' అని నవ్వుతు నారా లోకేష్ తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చారు.
ఇది ఇలావుండగా, యువత సమస్యలను పరిష్కరించేందుకే యువగళం పాదయాత్ర చేపట్టానని నారా లోకేశ్ అన్నారు. విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలను సమాధానం చెప్పారు. దేశమంతా గొప్పగా చెప్పుకునే ఏపీ.. ఇప్పుడందరికీ చులకనైందన్నారు. ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత నిర్ణయించుకోవాలని లోకేశ్ సూచించారు.
నారా చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వం ఫాక్స్కాన్ వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తుందని మండిపడ్డారు. 3 రాజధానులు కావాలా?.. అమరావతి రాజధాని కావాలా?.. చిన్న జీతంతో సరిపెట్టుకుంటారా?.. రూ.50 వేల జీతం తీసుకుంటారా? అని విద్యార్థులను, యువతను ప్రశ్నించారు. ఎలాంటి భవిష్యత్తు కావాలో యువతే నిర్ణయించుకోవాలని లోకేశ్ అన్నారు.

నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ రాలేదని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల కోసం యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, ఇంకో 9 నెలలు ఓపిక పట్టండి.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు లోకేష్. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళిక అమలు చేశామని అన్నారు.
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని.. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకూ విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకువస్తామన్నారు. సామాజిక బాధ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారని లోకేశ్ గుర్తు చేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications