మిత్రులతో కలిసి ప్రేయసి హత్య: నిందితుల అరెస్టు
వివరాలు ఇలా ఉన్నాయి - నల్లగొండ జిల్లాకు చెందిన పంగాల వేణు (22), బాలం మధు (22), కాసాని శ్రీను (23), అనంతుల కాటమయ్య (25), నీలం కార్తిక్ కుమార్ (22) హైదరాబాదులోని మన్సూరాబాద్లో నివసిస్తూ లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఈ ఐదుగురు ముఠా కట్టి పార్కింగ్ చేసినన లారీలను ఎత్తుకెళ్లి విడిభాగాలుగా చేిస విక్రయించేవారు. ఈ క్రమంలోనే మధు, వేణు గతంలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చారు.
భర్తతో గొడవ జరగడంతో నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మల్లేపల్లికి చెందిన రమావత్ ్ను (30) వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్లోని హాస్టల్లో ఉంటూ కంప్యూటర్స్ చదువుతోంది. వేణుతో పరిచయం ఏర్పడి వారిద్దరి మధ్య ప్రేమ కుదిరింది. పెళ్లి చేసుకుంటానని వేణు ఆమెను తన వెంట తిప్పుకున్నాడు.
ఆ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడం ప్రారంభించింది. వేణుకు తన స్వగ్రామం చందంపేట మండలం గన్నెరపల్లిలో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఎలాగై అనును అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.
పథకం వేసుకుని 2011 జూన్ 16వ తేదీ పెళ్లి చేసుకుందామని ఆమెను వేణు శ్రీశైలం తీసుకుని వెళ్లాడు. అనును నమ్మించి మిత్రులను కూడా వెంట పెట్టుకుని వెళ్లాడు. శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిన తర్వాత చున్నీతో ఆమె ముఖాన్ని బిగించి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. గుర్తు పట్టకుండా ఉండాలని ముఖంపై బండరాయితో మోదారు.