లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: కిడ్నాప్
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ మండలం గూడలో సునీతా మెడికల్ షాపు యజమాని నర్సింహారెడ్డి అపహరణకు గురయ్యారు. దుకాణం నుంచే నర్సింహారెడ్డిని దండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్పై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నలుగురు వ్యక్తులు వచ్చి టాస్క్ఫోర్స్ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించారు. షట్టర్ మూసేసి పది నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత నర్సింహారెడ్డిని తమ వాహనంలో తీసుకుని వెళ్లారు.
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రవికుమార్కు పోలీసులు గుర్తించారు. మోడల్ రైతు చికెన్ బజార్లో రవికుమార్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే, సికింద్రాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతంలో గల యాదవ్నగర్లో ఓ వృద్దురాలిపై దుండగులు దాడి చేశారు. ఆమె నుంచి 12 తులాల బంగారం, 30 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు.