హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: కిడ్నాప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని కొత్తపేట శాంతాలాడ్జిలో శ్రీకాంత్, పల్లవి అనే ప్రేమికులుఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది వారిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో వారు ఆ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ మండలం గూడలో సునీతా మెడికల్ షాపు యజమాని నర్సింహారెడ్డి అపహరణకు గురయ్యారు. దుకాణం నుంచే నర్సింహారెడ్డిని దండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌పై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నలుగురు వ్యక్తులు వచ్చి టాస్క్‌ఫోర్స్ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించారు. షట్టర్ మూసేసి పది నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత నర్సింహారెడ్డిని తమ వాహనంలో తీసుకుని వెళ్లారు.

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రవికుమార్‌కు పోలీసులు గుర్తించారు. మోడల్ రైతు చికెన్ బజార్‌లో రవికుమార్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే, సికింద్రాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో గల యాదవ్‌నగర్‌లో ఓ వృద్దురాలిపై దుండగులు దాడి చేశారు. ఆమె నుంచి 12 తులాల బంగారం, 30 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు.

English summary

 Lovers attempted to commit suicide in a lodge at Kothapet in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X