వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాగుంట టిడిపి వైపు చూస్తున్నారా?: హామీకి బాబు నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Magunta sees at Telugudesam
హైదరాబాద్: ఒంగోలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారట. ఆయన సన్నిహితులు కొందరు సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారని ప్రచారం సాగుతోంది. ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీ సీటును మాగుంట ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.

దీనిపై చంద్రబాబు స్పందన ఇంకా తెలియరాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కూడా సోమవారం చంద్రబాబును కలిసినట్లు ప్రచారం జరిగింది. ఆయన తాడేపల్లిగూడెం సీటును ఆశిస్తున్నారు.

కాగా, కాంగ్రెస్ నుంచి అనేక మంది టిడిపిలో చేరడానికి వస్తున్నా పలువురికి సీటు హామీ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరిస్తున్నారట. అందర్నీ కాకుండా గెలుపు గుర్రాలనే తీసుకుందామని చెబుతున్నారట. టిడిపిలోకి వచ్చే వారు ఖాయంగా గెలుస్తారని తేలితేనే టికెట్ ఇద్దామని, పార్టీలో మంచి అభ్యర్థి కొరత ఉండి, వచ్చేవారి వల్ల ఉపయోగం ఉందంటేనే తాను ఆలోచిస్తున్నానని పార్టీ నాయకులకు చెబుతున్నారట.

తెరాసలోకి నగేష్, సత్యవతి

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నగేష్ (బోథ్), సత్యవతి రాథోడ్ (డోర్నకల్) తదితరులు సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెరాసలో చేరారు. ఇకపై బోథ్‌కు నగేష్, డోర్నకల్‌కు సత్యవతి రాథోడ్‌లు తెరాస ఇంఛార్జిలుగా కొనసాగుతారని కెసిఆర్ తెలిపారు.

English summary
It is said that Congress Party senior MP Magunta Srinivasulu Reddy is seeing at Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X