రూటు మార్చి పవన్ కల్యాణ్పై 'కత్తి': ఆ భేటీ ఆందోళనకరం
హైదరాబాద్/ విజయవాడ: పవన్ కల్యాణ్ అభిమానులతో అవగాహనకు వచ్చిన తర్వాత సినీ క్రిటిక్ మహేష్ కత్తి రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. నేరుగా పవన్ కల్యాణ్ను ప్రస్తావించడం లేదు. కానీ ఆయనను ఉద్దేశించి మాత్రం వ్యాఖ్యలు చేస్తున్నారు.
మహేష్ కత్తి చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ను ఉద్దేశించే చేస్తున్నట్లు మాత్రం అర్థమవుతోంది. తన వైఖరిని ఆయన చాలా స్పష్టంగానే వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరి మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ఓ వ్యాఖ్య చేశారు.
టిడిపిని ప్రశ్నించనంటే ఎలా...
తెలుగుదేశం పార్టీ అవినీతిపై ఆధారాలున్నాయన్నా, ప్రశ్నించనంటూ మొండికేస్తేఎలా అని మహేష్ కత్తి అన్నారు. న్యూట్రల్గా ఉన్నాం అంటే న్యూట్రల్గానే ఉండాలని, మిత్ర పక్షమైతే స్నేహధర్మం పాటించాలని ఆయన అన్నారు..
అనవసరపు అనుమానాలు వస్తాయి...
ఇలా అటూ ఇటూ కాకపోతే అనవసరపు అనుమానాలు వస్తాయని మహేష్ కత్తి అన్నారు. సమర్థత, ధైర్యంపైన సదేహాలు వస్తాయని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ పేరును ఆయన ప్రస్తావించలేదు. కానీ ఆయన గురించే ఆ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు.
Recommended Video
జాత్యహంకార ప్రభుత్వం...
తూర్పు యూరప్ దేశం అయిన పోలండ్లో ఉన్నది ఒక జాత్యహంకార ప్రభుత్వమని, అలాంటి ప్రభుత్వ రాయభారి జనసేన నేత పవన్ కళ్యాణ్తో భేటీ కావటానికి ప్రజలు అంతగా పట్టించుకోనప్పటికీ ఆందోళనకర అంశమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాశారు.
ఆ వ్యాసం కాపీని కూడా..
బహిరంగ లేఖతో పాటు ఇటీవల ఓ ఇంగ్లీషు మ్యాగజైన్ కారవాన్లో పోలండ్ జాత్యహంకారంపై ప్రచురితమైన వ్యాసం కాపీని కూడా రామకృష్ణ పవన్ కల్యాణ్కు పంపించారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ మినహా ఏ ఇతర రాజకీయ పార్టీ నేతతో కూడా ఆ రాయబారి కలువలేదని ఆయన గుర్తు చేశారు.