Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి మరో భారీ పరిశ్రమ: లక్షల కోట్ల పెట్టుబడి.. ఎల్లుండే భూమిపూజ

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసే మరో బృహత్తర ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. ప్రపంచ ఉక్కు దిగ్గజం 'ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా' (AMNS India) అనకాపల్లి జిల్లాలో తన గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించనుంది. రూ. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు ఈనెల 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి భూమిపూజ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల కాలంలో రాష్ట్రానికి చేరిన అతిపెద్ద పారిశ్రామిక విజయంగా ఇది నిలవనుంది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు 5,465 ఎకరాల్లో ఈ ప్లాంట్ సాకారం కానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా, దీనికి అనుబంధంగా రూ. 11,198 కోట్ల వ్యయంతో 316 ఎకరాల్లో ప్రత్యేకంగా 'క్యాప్టివ్ పోర్టు'ను కూడా నిర్మించనున్నారు. ఈ పోర్టు ద్వారా మరో 6,000 మందికి అదనంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

Steel Revolution in AP CM Chandrababu to Lay Foundation for Rs 1 36 Lakh Crore ArcelorMittal Plant in Anakapalli
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది!
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది!

మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం వేగం

ఈ భారీ పరిశ్రమ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను జాతీయ రహదారి (NH-16)తో కలిపేలా 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనమిక్ రీజియన్ దేశంలోనే కీలకమైన పరిశ్రమల హబ్‌గా అవతరించనుంది.

సీఎం ఫైల్‌కే దిక్కులేదు, కాంగ్రెస్‌ మాటలు ఎవరు నమ్ముతారు?: KTR
సీఎం ఫైల్‌కే దిక్కులేదు, కాంగ్రెస్‌ మాటలు ఎవరు నమ్ముతారు?: KTR

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్..

సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నక్కపల్లి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ స్వయంగా ఈ భూమిపూజలో పాల్గొనడం విశేషం. అనంతరం ముఖ్యమంత్రి పలు అవగాహన ఒప్పందాల (MoUs) కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+