టీటీడీకి మరిన్ని టాస్కులు
Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయం అయిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలపై టీటీడీ దృష్టి సారించింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా ఈ మూడు బిగ్ టాస్క్ లను కూడా విజయవంత చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఉద్యోగులతో సమావేశం అయ్యారు వారికి దిశానిర్దేశం చేశారు.
తిరుపతిలోని మహాతి ఆడిటోరియంలో ఈ సమావేశం ఏర్పాటైంది. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో వీ వీరబ్రహ్మం, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ దీనికి హాజరయ్యారు. టీటీడీ ఉద్యోగులు, తిరుపతి పోలీసులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు అభినందించారు.

తిరుమలలో బ్రహ్మోత్సవ సమయంలో కల్పించిన సౌకర్యాలపై భక్తులు 100 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి చివరి రోజు వరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్యాలరీలు, క్యూలైన్లు, గరుడ సేవ రోజు ప్రణాళికా బద్ధంగా ప్రతి ఒక్క భక్తుడికి అన్నప్రసాదాలు అందించేలా, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు చేశారని, ఆకట్టుకునేలా విద్యుత్ కాంతులు, పుష్ప అలంకరణలు, రవాణా, ట్రాఫిక్, తదితర సేవలలో అందరూ చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు.
వచ్చే బ్రహ్మోత్సవాలకు సీసీ కెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్, రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి మూడు నెలల ముందు నుండే పకడ్బందీగా ప్రణాళికలను రూపొందించుకున్నామని తెలిపారు.
ప్రతి రోజూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ ఒక టీం వర్క్ గా పని చేశారని అన్నారు. ఈ ఏడాది టెక్నాలజీ సేవలను సద్వినియోగం చేసుకున్నామని సుబ్బరాయుడు తెలిపారు. కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తిరుమల, తిరుపతిలలో పార్కింగ్ సమస్య లేకుండా, వృద్ధులకు సేవలు, చిన్న పిల్లలకు జియో ట్యాగ్ సిస్టం ఏర్పాటు, సోషల్ మీడియా, సైబర్ వింగ్ చాలా అప్రమత్తంగా పనిచేశారని చెప్పారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications