భార్యను హత్య చేసి...ఆత్మహత్యలా చిత్రీకరించాడు...కానీ...
గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో భార్యపై అనుమానంతో ఆమెని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ కసాయి భర్త చివరకు పోలీసులకు దొరికి పోయాడు. హీటర్ పట్టుకోవడంతో కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని అందర్నీ నమ్మించిన ఈ హంతకుడు పోలీసుల కళ్లు మాత్రం కప్పలేకపోయాడు. పోలీసులు అప్రమప్తతతో వ్యవహరించి హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ హత్య కేసును చేధించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన జెనిత అనే మహిళ హత్య కేసుకు సంబంధించిన వివరాలను బాపట్ల డీఎస్పీ డి.గంగాధరం బుధవారం రూరల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

ఈ నెల 18న హీటర్ పట్టుకోవడం వల్ల విద్యుత్ షాక్కు గురై జెనిత మృతి చెందినట్లు ఆమె భర్త తెలిపాడంటూ హతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఇన్ఛార్జి సీఐ నాగేశ్వరరావు, ఎస్సై నఫీజ్బాషా ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. హతురాలి భర్త రాంబాబును వివరాలు అడుగగా భార్య నీళ్లు కాచేందుకు హీటర్ ను బక్కెట్లో పెట్టిందని, నీళ్లు ఎంత వేడెక్కాయో చూసేందుకు బక్కెట్ లో చేయిపెట్టడంతో షాక్ కొట్టి చనిపోయిందని చెప్పాడు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు బక్కెట్లో రెండు మగ్గుల కంటే ఎక్కువ నీళ్లు లేకపోవడం గమనించారు.
దీంతో అనుమానం వచ్చిన వారు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఆ తరువాత భార్యాభర్తలు నిద్రించిన గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ భార్య జెనిత చేతి గాజులు పగిలిన ముక్కలు పడిఉండటంతో అక్కడ ఏదో గొడవ జరిగిందని, ఆ నేపథ్యంలోనే హత్య జరిగివుంటుందని పోలీసులు భావించారు. ఆ ప్రకారం మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తుండగానే నిందితుడు తాను దొరికిపోవడం ఖాయమని గ్రహించి ఘటనా స్థలాన్నుంచి జారుకొని గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఎదుట భర్త రాంబాబు లొంగిపోయాడు.
తదనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్య విషయం, వెనుక కారణాలు వెల్లడించాడు. భార్యకు, తనకు మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోందని, పెద్దలు సర్దిచెబుతుండటంతో కలసి ఉంటున్నామని భర్త రాంబాబు చెప్పాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో తాను లుంగీ, చున్ని సహకారంతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశానని తెలిపాడు. తర్వాత హీటర్ను ఆమె చేతిలో పెట్టి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు వివరించాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో హత్య జరిగిన 24 గంటల్లోపే అసలు విషయం వెలుగు చూసింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications