ప్రేయసిపై ప్రియుడి దాడి: భార్యాపిల్లలపై వ్యక్తి దాడి

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం పార్కు రోడ్డులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలపై, బార్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణానకి చెందిన నావూరి కాస్పర్ బుధవారం రాత్రి తాగిన మత్తులో ఆ దాడికి ఒడిగట్టాడు.
రాత్రి భోజనం చేస్తున్న సమయంలో తనకు కోడిగుడ్డు వండలేదని భార్యతో గొడవ పడుతుండగా కుమారుడు అడ్డు వచ్చాడు. ఆ కోపంతో తాగిన మైకంలో అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న భార్యాపిల్లలపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.
భార్య అన్నమ్మ, కుమారుడు సునీల్, కూతురు నీలిమ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు వీరిని స్థానికులు చిన్న కాకాని ఎన్నారై జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications