చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియురాలి హత్యలో ట్విస్ట్: మరో వ్యక్తితో సంబంధం, ప్రియుడికే నో చెప్పింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగిన ప్రియురాలి హత్య కేసులో ట్విస్ట్. ప్రియుడు పెళ్లి చేసుకుందామని చెబితే అందుకు ప్రియురాలు అంగీకరించలేదు. పైగా మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా ప్రియుడు గుర్తించాడు. దీంతో ప్రియుడు హత్య చేసినట్లుగా తెలుస్తోంది.

గంగిరెడ్డిగారిపల్లికి చెందిన వేమ నారాయణ రెడ్డి తన ప్రియురాలు సబీహాను హతమార్చాడు. తాను తన ప్రియురాలిని ఏడేళ్ల పాటు పోషించానని, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ తనను మోసం చేసిందని, తనను దూరం చేయడంతో హతమార్చినట్లు నారాయణ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది.

నారాయణ రెడ్డి, సబీహా ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులుగా సబీహా కనిపించకుండా పోయింది. చివరకు ఆమెను ప్రియుడు నారాయణ రెడ్డి హత్య చేసి పాతిపెట్టారని పోలీసుల విచారణలో తేలింది. ప్రియుడిని శనివారం అదుపులో తీసుకున్న పోలీసులు విచారించారు.

Chittoor

గుర్రంకొండ మండల పరిధి టి రాసుపల్లె పంచాయతీ గంగిరెడ్డిగారిపల్లె వాసి నారాయణ రెడ్డి వాల్మీకిపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకునిగా పని చేస్తూ అక్కడే కంప్యూటర్‌ కేంద్రం నిర్వహిస్తున్నారు. అదే మండలం పునుగుపల్లె గ్రామానికి చెందిన సబీహా(23) నారాయణ రెడ్డి కంప్యూటర్‌ కేంద్రంలో 2010 సంవత్సరంలో ఉద్యోగంలో చేరారు.

ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న నారాయణ రెడ్డి బంధువులు సబీహాను గట్టిగా మందలించడంతో, అక్కడ పని మానేసి బెంగళూరులో ఉద్యోగం కోసం వెళ్లారు. అది భరించలేని ప్రియుడు బెంగళూరు వెళ్లి సబిహాను తీసుకొచ్చి ఆమె పేరును సంధ్యగా మార్చి, రెండేళ్ల క్రితం తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆటోమొబైల్‌ షాపులో ఉద్యోగానికి కుదిర్చారు.

ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డులో కూడా సంధ్యగా పేరు మార్చాడు. తిరుపతి రాజన్న పార్క్ సమీపంలో తిరుపతి రాజన్న పార్కు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, వారానికొకసారి ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇలా కొంత కాలం సాగిన తర్వాత, అదే దుకాణంలో పని చేస్తున్న యువకునితో సబీహా సన్నిహితంగా మెలుగుతున్నట్లు నారాయణ రెడ్డి అనుమానించారని పోలీసులు వివరించారు.

ఆమెకు అతను ఓ వాహనం కూడా కొనిచ్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 28న తిరుపతి వచ్చిన వేమ నారాయణ రెడ్డి సబిహాను పెళ్లి చేసుకుందామని కోరారని, తనకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని సబిహా చెప్పడంతో గొడవపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. తర్వాత ఏమైందో జనవరి 29వ తేదీన వేమ నారాయణ రెడ్డి తిరుపతిలోని ఇంటిని ఖాళీ చేసి సామాను మొత్తం తన స్వగ్రామంలోని ఇంటికి తరలించారు.

ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2వ తేదీన సబీహా అలియాస్‌ సంధ్య పని చేస్తున్న ఆటోమొబైల్‌ షాపు సిబ్బంది జనవరి 28వ తేదీ నుంచి ఆమె పనికి రావడం లేదని తల్లి జిలానీకి ఫోన్‌ ద్వారా తెలిపారు. తిరుపతికి చేరుకున్న తల్లి పడమటి పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తె ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో వేమ నారాయణ రెడ్డి విషయం వెలుగు చూసింది. అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు విచారించగా పెళ్లి చేసుకోలేదనే కోపంతో సబిహాను తానే హతమార్చి తన స్వగ్రామం గంగిరెడ్డిగారిపల్లెలోని ఇంటిలో పాతిపెట్టినట్లు వెల్లడైంది.

మరోవైపు, సబీహా ఉంటున్న ఇంటిని పరిశీలించిన పోలీసులకు, ఆమె పని చేస్తున్న దుకాణంలో పరిచయమైన వ్యక్తి కొనిచ్చిన ద్విచక్రవాహనానికి సంబంధించిన ఆర్సీ పత్రాలు, బయట ప్రదేశాలకు వెళ్లిన ప్రయాణ టిక్కెట్లు దొరికాయి. అప్పటికే పెళ్లైన మరో వ్యక్తితో తాను ప్రేమించిన యువతి సన్నిహితంగా ఉండటంతో గొడవలు తలెత్తి, ప్రియుడు నారాయణ రెడ్డి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాఫ్తు కొనసాగుతోంది.

English summary
Man brutally kills lover in Chittoor for cheating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X