దూకేస్తా: ప్రత్యేక హోదా కోసం సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్
అనంతరపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు పెనుబోలు విజయ్ భాస్కర్ శనివారం సెల్ టవర్ ఎక్కారు. ధర్మవరంలో శనివారం సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
హోదా కోసం చనిపోతానంటూ లేఖ కూడా రాశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ప్రత్యేక హోదాపై హామీ ఇస్తే కిందికి దిగుతానని భాస్కర్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల వరంగల్కు చెందిన ఓ వ్యక్తి దేశరాజధానిలో సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Comments
English summary
A man in Anantapur district has created hulchal demanding special category status to the state. The man has climbed a cell tower at Dharmavaram in Anantapur district demanding immediate special category status to the state.
Story first published: Saturday, August 11, 2018, 12:41 [IST]