తల్లి కోరిక తీర్చడం లేదని కొడుకు కిడ్నాప్, వలవేసి అరెస్ట్
విజయవాడ: తన లైంగిక వాంఛలను తీర్చడం లేదన్న కోపంతో ఓ మహిళ కొడుకును అదే గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసిన సంఘటడన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ముసునూరులో ఆటో డ్రైవర్గా పని చేస్తున్న సుబ్బారావు అనే వ్యక్తి కన్ను ఓ మహిళ పైన పడింది.
గత కొంతకాలంగా ఆమె వెంటబడటం ప్రారంభించాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమెకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఆ కొడుకు కిరణా దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు అతనిని ఆటో ఎక్కించుకొని నూజివీడు తీసుకెళ్లి ఓ హోటల్లో బంధించాడు.
అనంతరం తల్లికి ఫోన్ చేసి.. వెంటనే రాకుంటే కొడుకును చంపేస్తానని బెదిరించాడు. ఆందోళన చెందిన ఆమె భర్తకు విషయం చెప్పింది. భర్త, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో... తాను హోటల్కు వస్తున్నట్లు ఆమె చెప్పింది. అక్కడకు వెళ్లిన పోలీసులు సుబ్బారావును అరెస్ట్ చేశారు. కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు పెట్టారు.