ఘోరం: ముందు గొంతు కోశాడు.. ఆ తరువాత డంబెల్తో.. ఓ ప్రియుడి ఉన్మాదం
నగరంలో ఘోరం జరిగింది. పూర్ణామార్కెట్ పండావారి వీధిలో ఓ ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని దారుణంగా హతమార్చాడు. తొలుత అద్దం ముక్కతో గొంతుకోసి, ఆ తర్వాత డంబెల్తో తలపై మోది ఆమెను హతమార్చాడు.
విశాఖ: నగరంలో ఘోరం జరిగింది. పూర్ణామార్కెట్ పండావారి వీధిలో ఓ ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని దారుణంగా హతమార్చాడు. తొలుత అద్దం ముక్కతో గొంతుకోసి, ఆ తర్వాత డంబెల్తో తలపై మోది ఆమెను హతమార్చాడు.
ఉన్మాద ప్రేమికుడి పేరు.. సతీష్కుమార్, అతడి ఉన్మాదానికి బలైన ఆ యువతి పేరు భవానీ. మూడేళ్లుగా వీరికి పరిచయం ఉంది. ఒకరింటికి మరొకరు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో సతీష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవానీని తన ఇంటికి పిలిపించుకున్న సతీష్ ఆమెను అతిదారుణంగా చంపేశాడు. అడ్డుకోబోయిన వాళ్లను కూడా చంపేస్తానని బెదిరించాడు.
ఆ తర్వాత స్థానికులు సతీష్ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలపాలైన సతీష్ను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ అఘాయిత్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications