ఏపీలో ఆ స్కూల్స్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి డ్యాన్స్.. ఎందుకంటే
విద్యార్థుల ప్రగతికి దోహదం చేయాలంటే వారికి ఎలా చెబితే వంటపడుతుంది అనేది గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులలో పురోగతి కోసం మనసు పెట్టిన మన్యం జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని సైతం ఆకట్టుకుంటున్నారు.
మన్యం డాన్స్ పేరుతో మరో నూతన కార్యక్రమం
ఇప్పటికే ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అలవాటు చేయడానికి ప్రయత్నం చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకోవడానికి ప్రేరణని ఇచ్చారు. ఇక తాజాగా మరో వినూత్న కార్యక్రమంతో చిన్నారులలో సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేస్తున్న కలెక్టర్ మన్యం డాన్స్ పేరుతో మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పిల్లలలో నైపుణ్యాల మెరుగుదలకు మన్యం డ్యాన్స్
పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య బలమైన అనుబంధాన్ని పెంచడానికి, పిల్లలలో సిగ్గు, భయం వంటి వాటిని దూరం చేయడానికి, వారిలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ప్రతి శనివారం ఉదయం ప్రార్థన సమయం తర్వాత కొంతసేపు పిల్లల్లో ఈ మన్యం డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఇది పిల్లలలో రోజంతా ఉత్సాహాన్ని నింపుతుంది.
చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మన్యం డ్యాన్స్
మానసికంగా, శారీరకంగా చిన్నారులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ కార్యక్రమం వల్ల పాఠశాల వాతావరణం సంతోషకరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ విద్యార్థులతో మమేకమవుతారు. తాజాగా వీరఘట్టం మండలం తలవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మన్యం డాన్సులో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పాల్గొన్నారు.
మన్యం డ్యాన్స్ లో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్
ఆయన విద్యార్థులతో కలిసి ఉల్లాసంగా స్టెప్పులేస్తూ ఏరోబిక్స్ లాంటివి ప్రదర్శించారు. ఇలా అయిన మాత్రమే కాదు అధికారులందరూ విద్యార్థులలో సృజనను వెలికి తీయడంతో పాటు వారిలో శారీరక, మానసిక ఉల్లాసానికి మన్యం డాన్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా విద్యార్థులను మంచి మార్పుకు దోహదం చేస్తుందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు











Click it and Unblock the Notifications