చుట్టుముట్టి, వెపన్స్ తీసుకొని: ఎమ్మెల్యే కిడారి హత్యకు ముందు గంటసేపు మాట్లాడిన మావోలు
విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోములపై మావోయిస్టులు ఆదివారం కాల్పులు జరపడంతో వారు అక్కడికి అక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. హత్యకు ముందు మావోయిస్టులు వారితో దాదాపు గంటసేపు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని వారు చెప్పినా వినలేదని సమాచారం.
మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందనే వాదనలు, బాక్సైట్ తవ్వకాలకు కిడారి అనుకూలంగా ఉన్నారనే వార్తలు, ఎక్కువ మంది సెక్యురిటీ లేకపోవడం ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.
నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే కూడా మృతి
కాల్పులకు ముందు గంటసేపు మాట్లాడారు
కిడారి, శివేరిలు భోజనం చేసి పది కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మావోయిస్టులు అడ్డుకున్నారని తెలుస్తోంది. ఏవోబీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. కాల్పులకు ముందు బాక్సైట్ తవ్వకాలు, ఓ క్వారీ తెరిపించే ప్రయత్నాలపై గంటసేపు మాట్లాడారని తెలుస్తోంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని, వారు చెప్పినా, గంట తర్వాత వారిని కాల్చి చంపినట్లుగా సమాచారం.
Recommended Video
ఇద్దరిని అతిసమీపం నుంచి కాల్చారు
వారితో చాలాసేపు మాట్లాడిన అనంతరం మావోయిస్టులు వారిని అతి సమీపం నుంచి కాల్చారు. మూడు రౌండ్ల కాల్పులు జరిపారని తెలుస్తోంది. వారి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో కిడారి సర్వేశ్వర రావు, శివేరి సోములు అక్కడికి అక్కడే కన్నుమూశారు. మన్యంలో నిన్నటి వరకు మావోయిస్టు వారోత్సవాలు కూడా జరుపుకున్నారు.
దాడిలో 60 మంది వరకు, 40 మంది మహిళలు
ఏవోబీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడి ఘటనలో దాదాపు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందులో 40 మంది వరకు మహిళలు ఉన్నారని సమాచారం. డుంబ్రీగూడ మండలో తొట్టంగి రోడ్డుపై ఈ కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న వెపన్స్ కూడా ముందే మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారు.
అనుచరులను కిందకు దించి, చుట్టుముట్టి
కిడారి సర్వేశ్వర రావు, శివేరి సోము అనుచరులు కలిసి వాహనాల్లో వెళ్తుండగా, వారిని కిందకు దించి, ఇద్దరిని మాత్రమే వాహనంలో ఉంచారని తెలుస్తోంది. వారు వాహనాల్లో వెళ్తుండగా దాదాపు అరవై మంది మావోయిస్టులు హఠాత్తుగా చుట్టుముట్టారు. మిగతా వారు దిగిపోయారు. దీంతో గంటసేపు మాట్లాడిన అనంతరం వారిపై కాల్పులు జరిపి చంపారని తెలుస్తోంది. పాయింట్ బ్లాంక్ రేంజ్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.