ఏపీలో వరద అంచనాకు కేంద్ర బృందం ప్రకటన- వారంలోగా నివేదిక ఇవ్వాలని టార్గెట్
ఏపీలో తాజాగా కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదలతో భారీగా పంటనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద పరిస్ధితులను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. క్షేత్రస్దాయిలో అధికారులు కూడా వరద నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు.
వరదల కారణంగా భారీగా పంటనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి నివేదికలు వెళ్లాయి. దీన్ని నిర్ధారించుకునేందుకు, వాస్తవ పరిస్ధితుల అధ్యయనానికి కేంద్ర హోంశాఖ ఓ ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం త్వరలో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయబోతోంది. నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రం గడువు విధించింది. దీంతో కేంద్ర బృందం రాక కోసం రాష్ట్ర అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు.

ఏపీలో వరద ప్రభావం అంచనాకు కేంద్రం ప్రకటించిన బృందానికి హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు వ్యవసాయ, ఆర్ధిక, విద్యుత్, రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి, జల్శక్తి శాఖల నుంచి ప్రతినిధులు కూడా ఉంటారు. వారం రోజుల్లోగా వీరు క్షేత్రస్ధాయిలో పర్యటించి వివరాలను హోంశాఖ పరిధిలో ఉండే విపత్తుల నిర్వహణ విభాగానికి అందజేయాలని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications