అమరావతే రాజధాని - మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు..!!
ఎన్నికల సమయంలో కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పార్టీ అభ్యర్దుల ఖరారు పై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిగా ఈ మూడు పార్టీలు పోటీ చేయటం దాదాపు ఖరారైంది. ఈ సమయంలోనే రాజధాని అమరావతి అంశం పైన మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ పొత్తుల గురించి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని రాంబాబు డిమాండ్ చేసారు. నర్సరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరి చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. ఇదే సమయంలో రాజధాని అంశం పైనా రాంబాబు స్పందించారు. అసలు ఏపీకి రాజధాని లేదని చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.

ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని, ఎపికి రాజదానిగా ఇప్పటికీ కొనసాగుతున్నదని చెప్పారు. రాజదానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు రాజధానిగా అమరావతి కొనసాగుతుందని వివరించారు. అంబటి రాంబాబు ఈ సారి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం నర్సరావు పేట వైసీపీ ఎంపీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన భారీ ర్యాలీతో నర్సరావుపేట చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పుడు పల్నాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలో అంబటి రాజధాని అమరావతి పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా చర్చకు కారణమైంది.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications