రైతుల ఖాతాల్లో రూ 20 వేల నిధుల జమపై చంద్రబాబు ప్రకటన..!!
AP Budget 2025-26: ఏపీ ప్రభుత్వం రూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. తొలి సారి ఏపీ బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటింది. వ్యవసాయ రం గానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రతిపాదించారు. రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం అమల్లో భాగంగా రైతు ల కోసం రూ 9,400 కోట్లు కేటాయించారు. మూడు విడతల్లో ఈ నిధులు జమ చేయనున్నారు.
రూ 48 వేల కోట్లతో
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రూ
48,340 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదించారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్న తెలిపారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86 శాతంగా నమోదైందని వివరించారు. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించిందని కానీ ప్రభుత్వం 2024-25లో రూ.13.09 కోట్లతో 4.30 లక్షల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించామని వెల్లడించారు.

రైతుల కోసం
అదే విధంగా 2025-26లో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. 2025-26లో 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరాకు చర్యల తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. బడ్జెట్ లో విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు ప్రతిపాదించారు.
ప్రత్యేక కేటాయింపులు
ఇక..ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు, పట్టు పరి శ్రమకు రూ.96.22 కోట్లు, సహకార శాఖకు రూ.239.85 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,112. 07 కోట్లు, మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు, ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు, వైఎస్సార్ వర్సిటీకి రూ.98.21 కోట్లు, ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు కేటాయించిన ప్రభుత్వం..
ఏపీ ఫిషరీస్ వర్సిటీకి రూ.38 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773.25 కోట్లు
ఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు ప్రతిపాదించారు. ఇక.. ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు కేటాయించగా.. నీటివనరుల శాఖకు రూ.12,903.41 కోట్లు ప్రతిపాదించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications