జగన్ వర్గం విషం కక్కుతున్నారు: మంత్రి దేవినేని, ఒంగోలు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమ స్పందించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాల్మనీ కేసులో ఉక్కుపాదం మోపుతామని ఆయన చెప్పారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వర్గం విషం కక్కుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు అమరావతి నిర్మాణంలో సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిర్మించ తలపెట్టిన సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని వివరించారు.

ఒంగోలు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ఒంగోలు పద్మావతి నర్సింగ్హోంలో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున చిన్నపిల్లల వార్డు ఇన్క్యుబేటర్ గదిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంక్యూబేటర్లో ఐదు రోజుల పసిపాప ఉంది.
మంటలు చెలరేగడాన్ని గమనించిన చిన్నారి తల్లి వెంటనే పాపను తీసుకొని బయటకు పరుగుతీసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, దాదాపు రూ.2లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. షార్ట్సర్క్యూట్తో ఆసుపత్రిలో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications