నేనే ఫ్లైట్ టిక్కెట్లు కొనిస్తా, దమ్ముంటే తీసుకురండి: విపక్షాలకు లోకేష్ సవాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఐటీ కంపెనీలు తీసుకు వస్తారా అని సవాల్ విసిరారు. మంత్రి నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఎన్ని కంపెనీలు తీసుకు వచ్చారని విపక్ష వైసీపీ, బీజేపీలు విమర్శలు గుప్పించింది.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మీకు విమాన ప్రయాణ టిక్కెట్లు నేను బుక్ చేస్తానని, హోటల్ ఖర్చులు కూడా నేనే భరిస్తానని, రాష్ట్రానికి రెండు ఐటీ కంపెనీలు తీసుకు రండి అని సవాల్ చేశారు.
నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
21 రోజుల్లో అన్నీ
ప్రతిపక్షాలు కనుక ఐటీ కంపెనీలు తీసుకు వస్తే తాము 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామని నారా లోకేష్ స్పష్టం చేసారు. 21 రోజుల్లో కంపెనీలకు భూములు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచంచారని, ఆయన సూచనల మేరకు కంపెనీలకు అన్ని అనుమతులు ఇస్తామన్నారు.
ఓ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్, పావుగా కొత్త నాయకుడు, రూ.4800 కోట్లు ఖర్చు: శివాజీ సంచలనం
బీజేపీ విష్ణుకు కౌంటర్
తాము ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకు వచ్చామని నారా లోకేష్ చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు దమ్ముంటే ఏపీకీ ఐటీ కంపెనీలను తీసుకు రావాలన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు అవుతున్న ఐటీ కంపెనీలపై బీజేఎల్పీ నేత విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై కూడా భగ్గుమన్నారు.
ఐటీ పాలసీ నిబంధనల ప్రకారమే
ఐటీ పాలసీ నిబంధనల ప్రకారమే ఎవరికి అయినా భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చిన సభ్యులు, రాని సభ్యులు తెలుసుకోవడానికే ఐటీ కంపెనీలకు సంబంధించిన అన్ని విషయాలను చెబుతున్నానని తెలిపారు.
ఏపీకి హీరో రావడంపై చంద్రబాబు
ఇదిలా ఉండగా, ఏపీని ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం సమీపంలో హీరో మాటార్స్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.1600 కోట్ల పెట్టుబడితో 600 ఎకరాల్లో ఏర్పాటు కాబోయే ఈ పరిశ్రమ ఆసియా ఖండంలోనే అతి పెద్దది అని చెబుతున్నారు.