పుష్కరాలకు రండి: చిరు, బాలకృష్ణతో పాటు టాలీవుడ్ ప్రముఖలకు ఆహ్వానం
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆహ్వానించారు. అందులో భాగంగా టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, హీరో కృష్ణ, విజయనిర్మల, దాసరి నారాయణరావు, జగపతిబాబు, కృష్ణంరాజులను ఆయన ఆహ్వానించారు.
టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులను ఆహ్వానించేటప్పుడు మంత్రి పల్లెతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. అలాగే, మురళీమోహన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జయసుధ, మోహన్ బాబు, గొల్లపూడి, కోట శ్రీనివాసరావు, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్లను కూడా ఆహ్వానించారు.
వీరితో పాటు నాగ చైతన్య, రవితేజ, దిల్ రాజు, రకుల్ ప్రీత సింగ్, గుణశేఖర్, ఆర్ నారాయణ మూర్తి, బాపినీడు, సురేశ్ బాబు, పైడిపల్లి శ్రీను, రావి కొండలరావు, సుధీర్, ఎల్బీ శ్రీరాం, రమేశ్ చంద్ర ప్రసాద్, రాఘవేంద్రరావు, రాజమౌళి, బోయపాటి శ్రీను, క్రిష్, పరుచూరి సోదరులను ఆహ్వానించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పల్లె అన్ని వార్తా పత్రికలు, చానెళ్ల అధిపతులను, ఎడిటర్లను కూడా పుష్కరాలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

పుష్కరాలకు రండి
ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలంటూ హీరో కృష్ణంరాజుని ఆహ్వానిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మంత్రి పల్లెతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.

పుష్కరాలకు రండి
ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలంటూ హీరో కృష్ణని ఆహ్వానిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. చిత్రంలో నటుడు నరేశ్తో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు.

పుష్కరాలకు రండి
ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలంటూ దర్శకరత్న దాసరి నారాయణను ఆహ్వానిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మంత్రి పల్లెతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

పుష్కరాలకు రండి
ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మంత్రి పల్లెతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు.

పుష్కరాలకు రండి
ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలంటూ హీరో బాలకృష్ణను ఆహ్వానిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మంత్రి పల్లెతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications