కేసీఆర్కు పల్లె హెచ్చరిక, క్రికెట్ మ్యాచ్ చూడనున్న తెలంగాణ సీఎం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, తమ పార్టీ నేతలను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి, టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డి గురువారం హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆయన్నే విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఎర్రచందనం డబ్బును రాజకీయాల్లో ఖర్చు: రమేష్
ఎర్రచందనం అక్రమ రవాణా పెద్ద మాఫియా అని రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ విమర్శించారు. కొంతమంది రాజకీయ నాయకులు ఎర్రచందనం డబ్బును రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ను కలిసిన సినిమా ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ఫిల్మ్చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు. జూన్ 21న ఎల్బీ స్టేడియంలో తెలుగు, తమిళ సినీనటుల క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్టు సీఎంకు తెలిపారు.
మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఎం సహాయనిధికి అందించనున్నట్టు చెప్పారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మ్యాచ్ నిర్వహణతో వచ్చిన ఆదాయాన్ని సీఎం సహాయ నిధికి ఇస్తామని చెప్పారు. క్రికెట్ మ్యాచ్ని చూసేందుకు కేసీఆర్ హాజరవుతారన్నారు.