ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి కాదు : వైఎస్సార్ రాక్షసుడే..దొంగే..జగన్ ను ఏమనాలి: రోజా గుర్తించాలి.. ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. ఏపీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ ను నీటి దొంగ..జగన్ ను గజదొంగ అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవసరమైతే యుద్దానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు. దీనికి వైసీపీ నేతలు రోజా..శ్రీకాంతరెడ్డి.. రవీంద్ర నాధ్ రెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎవరి పైన యుద్దం చేస్తారంటూ ప్రశ్నించారు.
ప్రశాంత్ రెడ్డి వివరణ..
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. ఏపీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ ను నీటి దొంగ..జగన్ ను గజదొంగ అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవసరమైతే యుద్దానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు. దీనికి వైసీపీ నేతలు రోజా..శ్రీకాంతరెడ్డి.. రవీంద్ర నాధ్ రెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎవరి పైన యుద్దం చేస్తారంటూ ప్రశ్నించారు.
వైఎస్సార్..జగన్ పైన సీరియస్ వ్యాఖ్యలు..
దీనికి కొనసాగింపుగా వైఎస్సార్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్సార్ వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి తెలంగాణ ఇవ్వాలని ఉన్న ఆయనే అడ్డుపడి అనేక మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణంగా కాలేదా.. తెలంగాణ ఉద్యమాన్ని అణచటానికి అనేక అరాచకాలు చేయలేదాం అంటూ నిలదీసారు. వైఎస్సార్ ముమ్మాటికి తెలంగాణ పాటిల రాక్షసుడే అంటూ కామెంట్ చేసారు. తెలంగాణ నీటిని ఆంధ్రకు తరలించిన నీటి దొంగే అని వ్యాఖ్యానించారు. అంతకు రెట్టింపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్న జగన్ ను ఏమనాలంటూ ప్రశ్నించారు.
Recommended Video
ఆ ప్రాజెక్టులు ఆపివేయాలి..
పాలమూరు..డిండి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఎన్టీజీ కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను పాటించి ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని కోరారు. రెండు రాష్ట్రాల నీటి వాటాను తేల్చాలని ఇద్దరం కలిసి బోర్డును కోరుదామని ప్రతిపాదించారు. రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ కడుతున్న ఆర్డీఎస్, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేసారు.