పల్నాడులో మంత్రి విడదల రజినికి షాకిచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు; అధికారులపై మంత్రి ఫైర్
పల్నాడు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల మధ్య పొసగడం లేదన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడదల రజినికి మధ్య వర్గ విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి చిలికి చిలికి గాలి వానగా మారి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మంత్రి విడదల రజినీకి ఎంపీ షాక్ ఇచ్చారు.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేరు లేకపోవడంతో, ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. శిలాఫలకం పైన తన పేరు లేకపోవడంపై మంత్రి విడదల రజని అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఈ వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో మంత్రి విడదల రజిని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం ఉంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్థానికంగా చర్చనీయాంశం కాగా, తాజాగా ప్రోటోకాల్ వివాదం కూడా చోటు చేసుకోవడంతో వీరి మధ్య గొడవలు పీక్స్ కి చేరాయి అన్న టాక్ వినిపిస్తుంది.
విడదల రజనికి, శ్రీకృష్ణదేవరాయలకు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగానే శిలాఫలకం పైన విడదల రజిని పేరు వేయలేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికలలో జగన్ ను గద్దె దించాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేస్తుంటే, రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల సొంత పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు జగన్ కు తలనొప్పిగా మారాయి.

వైనాట్ 175 అంటూ జగన్ ఎన్నికలకు రెడీ అవుతుంటే పార్టీ నేతల కుమ్ములాటలు మాత్రం జగన్ ఆలోచనలకు సంబంధం లేకుండా సాగుతున్నాయి. ముందు ముందు ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతాయా? లేక జగన్ ఆధిపత్య పోరు కొనసాగుతున్న నియోజకవర్గాలపై దృష్టి సారించి వారి మధ్య సమస్యలను పరిష్కరించి, అందరినీ ఏకతాటి మీదికి తీసుకువస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త!











Click it and Unblock the Notifications