తెలంగాణ ఎఫెక్ట్: లోకసభ వైపు సీమాంధ్ర సీనియర్ల దృష్టి

కొద్ది నెలల క్రితం హైదరాబాదుకు చెందిన ఓ మంత్రి సికింద్రాబాదు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చారు. ఇది సదరు మంత్రి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. తాజా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు లోకసభ స్థానం నుండి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మహీధర్ రెడ్డిల్లో ఒకరు పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు.
రాయలసీమ ప్రాంతంలో కూడా ఓ మంత్రి లోకసభకు పోటీ చేయనున్నారట. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో వచ్చే ఎన్నికలలోగా తెలంగాణ ఏర్పడుతుందని కాంగ్రెసు పెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు లోకసభ ఎన్నికలతో పాటు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు.
అదే జరిగితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మల్కాజిగిరి లేదా హిందూపురం నుండి లోకసభకు పోటీ చేస్తారనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. గుంటూరు లోకసభ స్థానానికి టిడిపి నుండి మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ సిద్ధంగా ఉన్నారు. టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా మల్కాజిగిరి నియోజకవర్గం నుండి అవకాశం వస్తే పోటీకి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో లోకసభకు పోటీ చేయడం ఉత్తమమని ముఖ్యంగా పలువురు కాంగ్రెసు నేతలు భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications