పెద్ద మనసు చాటుకున్న బీఎస్ఎఫ్- ఏపీ వ్యక్తిని కుటుంబంతో కలిపిన జవాన్లు
BSF: సరిహద్దు భద్రతా దళం గొప్ప మనసు చాటుకుంది. కంటి మీద కునుకు లేకుండా నిరంతరం పహారా కాస్తూ దేశాన్ని కంటిపాపలా కాపాడుకుంటోన్న బీఎస్ఎఫ్ జవాన్లు.. ఓ కుటుంబాన్ని కలిపారు. దారి తెన్ను తెలియకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని ఆయన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.
ఆ వ్యక్తి- మన తెలుగువాడే. ఏపీకి చెందినవాడే. పేరు వెంకట్రావు. వయస్సు 50 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా మండపేట సమీపంలోని నేలటూరు ఆయన స్వగ్రామం. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తిరుగుతున్న వెంకట్రావును బీఎస్ఎఫ్ జవాన్లు కాపాడారు. కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.

వెంకట్రావు దాదాపుగా మూడు నెలలుగా కనిపించకుండా పోయారు. ఇంటి నుండి తప్పిపోయారు. ఈ మూడు నెలల కాలంలో వెంకట్రావు కోసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో వెదికారు. బంధుమిత్రులనూ సంప్రదించారు. అవేవీ కూడా ఫలించలేదు.
ఎలా చేరుకున్నాడో తెలియట్లేదు గానీ వెంకట్రావు నేలటూరు నుంచి ఏకంగా జమ్మూ కాశ్మీర్కు వెళ్లారు. అఖ్నూర్ సెక్టార్లో సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు ఆయనను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న సమయంలో వెంకట్రావు కనిపించారు. తనకు సంబంధించిన విషయాలు గానీ, ఇతర వివరాలు గానీ స్పష్టంగా చెప్పలేకపోయారు. దీనితో అధికారులు రంగ ప్రవేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నేలటూరుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నాలు చేశారు.
Taking a step further from the duty, the Bordermen reunited a family.
— BSF (@BSF_India) April 12, 2025
Mr Venkat Rao, resident of East Godavari District, Andhra Pradesh was apprehended by BSF troopers on 31st March 2025 when he was roaming close to border area of Akhnoor, Jammu. He couldn’t provide reasons of… pic.twitter.com/5oSpeIEvaU
పూర్తి వివరాలన్నీ ధృవీకరించుకున్న తరువాత ఈ నెల 11వ తేదీన ఆయనను సురక్షితంగా కుటుంబంతో కలిపారు. బీఎస్ఎఫ్ జవాన్ల సహకారంతో దాదాపు మూడు నెలల తరువాత వెంకట్రావు సురక్షిత తిరిగి రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషపడ్డారు. బీఎస్ఎఫ్ జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
అటు సరిహద్దు భద్రత ఇటు సామాజిక బాధ్యత- రెండింటికీ బీఎస్ఎఫ్ జవాన్లు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారని కుటుంబ సభ్యులు చెప్పారు. దేశ రక్షణ మాత్రమే కాకుండా పౌరులను కాపాడుకోవడంతో వారి చిత్తశుద్ది మరోసారి నిరూపితమైంది ఈ ఘటనతో. దేశ పౌరులను కాపాడటం తమ సామాజిక బాధ్యతగా బీఎస్ఎఫ్ అధికారులు పునరుద్ఘాటించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications