వైసిపిలో వేదన, అందుకే టిడిపిలోకి: జగన్పై ఆదిరెడ్డి తీవ్రవ్యాఖ్య
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బుధవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపిలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లేదన్నారు. తాను ఆ పార్టీలో తీవ్ర మనోవేదన అనుభవించానని చెప్పారు.

ఈ కారణంగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పారు. అప్పారావు కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని ప్రచారం సాగినప్పటికీ, ఇరవైతో ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications