వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపిలో వేదన, అందుకే టిడిపిలోకి: జగన్‌పై ఆదిరెడ్డి తీవ్రవ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బుధవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపిలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లేదన్నారు. తాను ఆ పార్టీలో తీవ్ర మనోవేదన అనుభవించానని చెప్పారు.

MLA Adireddy says he faced problems in YSRCP

ఈ కారణంగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పారు. అప్పారావు కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని ప్రచారం సాగినప్పటికీ, ఇరవైతో ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది.

English summary
MLA Adireddy says he faced problems in YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X