5గురు డుమ్మా: జగన్‌కు షాక్, అదే 'అసంతృప్తి'తో టిడిపిలోకి అమర్నాథ్

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీలో మరో షాక్ తగలనుంది. మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం బెజవాడలో జరిగిన కీలక సమావేశానికి హాజరు కాలేదు.

అమర్నాథ్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి కూడా గైర్హాజరయ్యారు. మిగతా వారు హాజరు కాకపోవడానికి గల కారణాలను వారు అంతకుముందే జగన్‌కు తెలియజేశారని తెలుస్తోంది.

అయితే అమర్నాథ్ రెడ్డి తన గైర్హాజరీకి సంబంధించి పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గడచిన ఎన్నికలకు ముందు టిడిపిలో ఉన్న అమర్నాథ్ రెడ్డి ఎన్నికల అనంతరం వైసీపీ విపక్షానికే పరిమితం కావడం, పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టడంతో సైకిల్ ఎక్కాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

 MLA Amarnath Reddy absent in YSR Congress party meeting

ఈ మేరకు ఇప్పటికే ఆయన టీడీపీ కీలక నేతలను కలిసినట్లు కూడా సమాచారం. మంగళవారం బెజవాడలో జరిగిన కీలక భేటీకి హాజరుకాకపోవడం, గైర్హాజరీకి కారణాలు తెలపకపోవడంతో అమర్నాథ్ రెడ్డి వైసీపీ చేజారిపోయినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. త్వరలోనే ఆయన టిడిపిలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.

టిడిపిలో చేరుతున్నా: అమర్నాథ్ రెడ్డి

తాను టిడిపిలో చేరుతున్నట్లు మంగళవారం మధ్యాహ్నం అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. మొదటి నుంచి జగన్‌కు, పార్టీకి అండగా ఉన్న అమర్నాథ్ రెడ్డి పార్టీని వీడటంపై చర్చ జరుగుతోంది. పీఏసీ చైర్మన్ పదవి
కారణంగానే అమర్నాథ్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తోంది.

భూమా నాగిరెడ్డి పార్టీ వీడాక పీఏసీ చైర్మన్ పదవిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జ్యోతుల నెహ్రూ పార్టీని వీడారు. అదే అసంతృప్తితో అమర్నాథ్ రెడ్డి పార్టీని వీడుతుండటం గమనార్హం. అమర్నాథ్ రెడ్డితో వైసిపిని వీడిన వారి సంఖ్య సరిగా ఇరవైకి చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+