వైసీపీలో మరో వికెట్ పడబోతుందా..! : 'జంపింగ్ జాబితాలోకి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..!!'
గిద్దలూరు : ప్రకాశం జిల్లా రాజకీయాలను గమనిస్తే.. వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మారుతున్న తాజా రాజకీయాల ప్రకారం ఇప్పటిదాకా వైసీపీ నుంచి ఫిరాయించిన 17 మంది ఎమ్మెల్యేల జాబితాలో మరో పార్టీ నేత పేరు కూడా చేరే అవకాశం కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఓసారి ఆయన టీడీపీలో చేరుతున్నట్టుగా వార్తలు వచ్చినా..! అప్పట్లో అదేమి లేదని కొట్టిపారేశారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి.

అయితే, తాజా రాజకీయ పరిస్థితుల ప్రకారం, పార్టీ మారే యోచనలో భాగంగా ఇప్పటికే తన అనుచరులతో ఎమ్మెల్మే అశోక్ రెడ్డి మంతనాలు కూడా జరిపారట. రాచర్ల మండలానికి చెందిన కొంతమంది ముఖ్య కార్యకర్తలతో పార్టీ మార్పు అంశం చర్చించినట్టుగా తెలుస్తోంది. టీడీపీలో చేరుదామా..! అన్న ప్రతిపాదనను ఆయన కార్యకర్తల ముందు ఉంచినట్టు సమాచారం.
ఇప్పటిదాకా దీనిపై అధికారిక ప్రకటనేది లేకపోయినప్పటికీ, కార్యకర్తల నుంచి పూర్తి మద్దతు లభిస్తే అశోక్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications