అంత్యక్రియల్లో నాయకురాలి తల్లి పాడెను మోసిన టీడీపీ ఎమ్మెల్యే..
అంత్యక్రియలకు హాజరైన ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ఆమె పాడెను మోశారు.
ఉండి: టీడీపీ నాయకురాలు మంతెన రమాదేవి తల్లి రుద్రరాజు పద్మావతి(90) బుధవారం నాడు మృతి చెందారు. అంత్యక్రియలకు హాజరైన ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ఆమె పాడెను మోశారు. అంతకుముందు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాగా, టీడీపీ నాయకురాలు రమాదేవి శివ స్వచ్చంద సంస్థ కో-ఆర్డినేటర్ గాను సేవలందిస్తున్నారు. ఆమె తల్లి మరణించారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శివరామరాజు, వారి ఇంటికి వెళ్లి రమాదేవిని ఓదార్చారు. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు.

ఎమ్మెల్యే శివరామరాజుతో పాటు మంతెన చంటిరాజు, ఉండి ఏఎంసీ చైర్మన్ కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు, తదితరులు ఆయన వెంట రమాదేవి ఇంటికి వెళ్లారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొనడంతో పాటు స్వయంగా ఎమ్మెల్యే శివరామరాజు పాడె మోయడాన్ని స్థానికులు ఆసక్తి గమనించారు.
హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులకు పరామర్శ:
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శివరామరాజు పరామర్శించారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన హేమంత్ కుమార్ మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications