కనీస జ్ఞానం లేదా?, నేనంటే అంత చులకనా?: జగన్ పార్టీ ఎమ్మెల్యే సీరియస్
రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప: రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ నూతన భవన ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం పంపకపోవడంపై ఆయన మండిపడ్డారు.
ప్రొటోకాల్ పాటించడం కూడా తెలియదా? అంటూ వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఓ మల్లికలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన ప్రారంభోత్సవానికి హాజరైన కోరముట్ల మాట్లాడుతూ.. ఎమ్మెల్యేనైన తనకు ఆహ్వానం పంపాలన్న కనీస జ్ఞానం కూడా లేదా? అంటూ ధ్వజమెత్తారు.

తనను అవమానించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్న అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, స్పీకర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
ఎమ్మెల్యే అంటే అంత చులకనగా ఉందా? అంటూ నిప్పులు చెరిగారు. రైతులకు ఎంతో ముఖ్యమైన వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందులను ఇవ్వాల్సిన అధికారులు సక్రమంగా పని చేయడం లేదని ఆరోపించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications