సజ్జలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సారి ప్రభుత్వ సలహాదారు సజ్జల ను టార్గెట్ చేసారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సారి ప్రభుత్వ సలహాదారు సజ్జల ను టార్గెట్ చేసారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. తనను ఒక్కడిని చేసి వైసీపీ నేతలంతా మాటల దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను సీఎం జగన్ కు నమ్మక ద్రోహం చేసి ఉంటే తనను నాశనం చేయమని దేవుడిని వేడుకుంటానని చెప్పారు. తాను అధికారం వదులుకొని వచ్చానని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబును కలిసి ఉంటే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తన మీద కోపం ఉంటే తన గురించి మాట్లాడాలని..పిల్లల గురించి ప్రస్తావన చేయవద్దని కోరారు.

నేను మోసం చేయలేదు...
తాను ఆఖరి దాకా ఉండి నామినేషన్ల సమయంలో మోసం చేయలేదని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. నెల రోజుల క్రితం వరకు తనకు ఎటువంటి ఆలోచనలు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారం దొరికిన తరువాత మాత్రమే తాను తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చానని చెప్పారు. తాను 35 ఏళ్ల ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేసారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. తాను ప్రేమించిన వారే తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ చేయటంతో తన మనసు విరిగిందన్నారు. అవమానించిన చోట ఉండకూడదనే తాను అధికారం వదులుకోవటానికి సిద్దమయ్యానని వివరించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని ఆరోపించారు.

సజ్జల పైన కోటంరెడ్డి కామెంట్స్..
ప్రభుత్వ సలహాదారు సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే మేధస్సు ఉందని ఎద్దేవా చేసారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఇసుక..మద్యం వ్యాపారాలు ఎవరు చేస్తున్నారో వారి పైన ట్యాపింగ్ చేయించాలని డిమాండ్ చేసారు. వైసీపీ ప్రభుత్వంలో థియేటర్లు నడపలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇసుక, మద్యం పేరుతో ఎవరు దోచుకుంటున్నారో..ఆ డబ్బులు ఎక్కడకు పోతున్నాయో ఆడియోలు పెట్టించాలని కోటంరెడ్డి సవాల్ విసిరారు. ట్యాపింగ్పై విచారణ జరపకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఇసుక మాఫియా ఎవరినీ ఖాతరు చేయడం లేదన్నారు.

ఎన్ కౌంటర్ చేస్తేనే నా వాయిస్ ఆగేది..
తనను అరెస్ట్ చేస్తామని సజ్జల ఆధ్వర్యంలో మీడియాకు లీకులు ఇస్తున్నారని..ఎప్పుడెైనా అరెస్ట్ చేసుకోవచ్చని కోటంరెడ్డి పేర్కొన్నారు. జైళ్లు రాజకీయ నేతలకు అచ్చి వస్తాయన్నారు. ఎన్ కౌంటర్ చేస్తే మినహా.. ఎన్ని కేసులు పెట్టినా తన గొంతు ఆగదని కోటంరెడ్డి స్పష్టం చేసారు. నెల రోజుల పాటు రాజకీయాలు మాట్లాడనని...రూరల్ ఇంచార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డికి నియోకవర్గంలో ఉన్న సమస్యలను వివరించారు. ఎన్నికల సమయంలోనే ఎవరు ఏంటనేది తేలుతుందన్నారు. ఎన్నికలప్పుడు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని..ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కాలమే నిర్ణయిస్తుందని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. తనతో నిలిచే కార్యకార్తలతో ఆత్మీయ సమావేశాలు ఉంటాయని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications