Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ నిర్ణయం నచ్చలేదు.. బాబు నుంచి భరోసా వచ్చింది గనుకే: టీడీపీలో చేరికపై ఎమ్మెల్యే రాజేశ్వరి

కార్యకర్తలతో చర్చించాకే వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు.

Recommended Video

    జగన్‌కు గట్టి షాక్: మరో వికెట్ టీడీపీలోకి నెక్స్ట్ ఏంటి జగన్ ? | Oneindia Telugu

    విజయవాడ: కార్యకర్తలతో చర్చించాకే వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని జగన్ తీసుకున్న నిర్ణయం తనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చలేదని అన్నారు.

    శనివారం ఉదయం టీడీపీలో చేరిక అనంతరం ఆమె మాట్లాడారు. పార్టీ వీడటంపై స్పందిస్తూ.. తన నియోజకవర్గంలో ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారంతా తనపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ జగన్, తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోగా.. అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు.

    mla rajeswari says jagan's assembly boycott decision was not good

    ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర సమమే మిగిలి ఉన్న తరుణంలో.. అసెంబ్లీని బహిష్కరిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్దిపై చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తానని అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+