Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కబడ్డీ ఆడిన రోజా: తిరుపతిలో సందడిగా జాతీయస్థాయి కబడ్డీ పోటీలు; నగరి ఎమ్మెల్యే ఆటతో క్రీడాకారుల్లో జోష్

నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి నియోజకవర్గంలో తనదైన శైలిలో దూకుడు చూపిస్తున్నారు. ఆమె ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి. లాక్ డౌన్ సమయం లో కరోనా మహమ్మారి కట్టడికి విధులు నిర్వర్తించిన వారికి స్వయంగా వంట చేసి పెట్టిన రోజా , అప్పట్లో అంబులెన్సు నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత దిశ స్కూటర్లను నడిపి సందడి చేశారు. గతంలో డప్పు కళాకారులతో కలిసి డప్పు కొడుతూ ఎమ్మెల్యే రోజా అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆటలు అంటే ఎనలేని మక్కువ చూపించే రోజా కబడ్డీ, వాలీబాల్ షటిల్ ఇలా ఏ ఆట అయినా సరే అదరగొట్టేస్తారు. హుషారుగా ఆడుతూ అందరిలో జోష్ నింపుతారు ఎమ్మెల్యే రోజా.

తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో కబడ్డీ ఆడిన రోజా

తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో కబడ్డీ ఆడిన రోజా

ఇక తాజాగా తిరుపతిలో జరుగుతున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు రోజా క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు వారితో ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలనుతిరుపతిలో నిర్వహించటం గర్వకారణమని రోజా క్రీడలతో ఆనందం దక్కుతుందని, ఆరోగ్యంగా ఉంటామని వెల్లడించారు. కాసేపు కబడ్డీ ప్లేయర్ గా మారిపోయిన రోజా మేయర్ శిరీష, కమిషనర్ గిరీశ లతో కబడ్డీ ఆటలో తలపడ్డారు. క్రీడాకారులకు గట్టిపోటీ ఇస్తూ ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడారు. రోజా ఆటతీరుకు క్రీడాకారులు కూడా ఫిదా అయిపోయారు.

రోజాతో పాటు కబడ్డీ కోర్టులోకి దిగిన తిరుపతి మేయర్, కమీషనర్

రోజాతో పాటు కబడ్డీ కోర్టులోకి దిగిన తిరుపతి మేయర్, కమీషనర్

రోజా తో పాటు తిరుపతి మేయర్ పలువురు మహిళా నేతలు కూడా కోర్టులో దిగి కబడ్డీ ఆడటం అక్కడ ఉన్న వారందరిలో జోష్ నింపింది. రోజా కోర్టులోకి కబడ్డీ కబడ్డీ అంటూ కూత పెట్టడంతో ఒక్కసారిగా స్టేడియం అంతా దద్దరిల్లింది. స్టేడియం లో ఉన్న ప్రేక్షకులందరూ కరతాళధ్వనులతో ఎమ్మెల్యే రోజా ఆటను ఆస్వాదించారు. జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను వీక్షించిన రోజా కబడ్డీ వాలీబాల్ లాంటి ఆటల పోటీలు జరగడం సంతోషంగా ఉందని, తాను ఎప్పుడైనా సరే క్రీడాకారులను ప్రోత్సహిస్తానని ఎమ్మెల్యే రోజా చెప్పారు.

కబడ్డీ పోటీలను ఆసక్తిగా తిలకించిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రోజా తదితరులు

కబడ్డీ పోటీలను ఆసక్తిగా తిలకించిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రోజా తదితరులు

ఇదిలా ఉంటే రోజా తో పాటు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష తదితరులు ఆసక్తికరంగా తిలకించారు. దేశవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమని ఆధ్యాత్మిక క్షేత్రానికి క్రీడలతో కొత్త కళ వచ్చిందని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో రోజా ఆట ప్రధాన ఆకర్షణ

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో రోజా ఆట ప్రధాన ఆకర్షణ

జాతీయ క్రీడలను తిరుపతిలో నిర్వహించటం గర్వకారణమని క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తిరుపతి జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. కబడ్డీ పోటీలతో తిరుపతిలో పండుగ వాతావరణం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

గతంలోను రోజా నగరి నియోజకవర్గం లో గ్రామీణ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించారు. భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ కబడ్డీ అంటూ కాసేపు కబడ్డీ కోర్టులో కబడ్డీ ప్లేయర్ గా మారిపోయిన రోజా సరదాగా కబడ్డీ ఆడారు. ఇప్పుడు మరోమారు ఉత్సాహంగా కబడ్డీ ఆడి అందరిలో ఉత్సాహం నింపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+