కుప్పకూలిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ: ఆస్పత్రికి తరలింపు
చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ అస్వస్థతకు గురయ్యారు. గురువారం మాజీ మేయర్ కటారి అనురాధ భర్త మోహన్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆమె రక్తపోటు పడిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

దీంతో ఆమెను హుటాహుటిన చిత్తూరు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!
ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఎన్నికలకు సంబంధించి టిడిపి బలపరిచే అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల స్థానానికి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పట్టభద్రుల స్థానానికి కె.జె.రెడ్డి, అనంతపురం, కడప, కర్నూలు ఉపాధ్యాయుల స్థానానికి బచ్చలపుల్లయ్యకు మద్దతిస్తున్నట్లు టిడిపి ప్రకటించింది.












Click it and Unblock the Notifications