'జగన్ దూరమవుతున్నారు, పులివెందుల నడివీధిలో 4వేలమంది రాలేదు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి సవాల్ చేశారు.
పులివెందుల నియోజకవర్గానికి జగన్ చేసింది ఏమీ లేదన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో పులివెందుల నడివీధిలో సమావేశం నిర్వహిస్తే 4వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
గండికోట నుంచి పైడిపాళెంకు నీరు మళ్లించే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైన సమావేశానికి యాభై వేల మంది ప్రజలు హాజరయ్యారన్నారు. జగన్ ప్రజల విశ్వాసానికి దూరమవుతున్నారన్నారు.

వైయస్ పేరు చెప్పుకొని రాజకీయాలు
తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని ఇంకా రాజకీయాలు సాగిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలం నుంచి గండికోటకు నీరు వస్తాయని తెలిసే రైతులను మభ్యపెట్టేందుకు పులివెందులలో ధర్నా చేశారన్నారు.

వైసిపి ఎంపీలు రాజీనామా చేస్తే..
జూన్లో వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ అంటున్నారని, రాజీనామా చేస్తే వైసీపీ మళ్లీ గెలవలేదన్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచైనా, కడప పార్లమెంటు నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.

అది జగన్కే చెల్లింది
జగన తీరు సరిగా లేదని సతీష్ రెడ్డి అన్నారు. ఆయన ప్రవర్తనను అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేయడం ద్వారా.. వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్న వారిని సైతం జైలుకు పంపడం జగన్కే చెల్లిందన్నారు.

బీటెక్ రవిదే గెలుపు
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి విజయం తథ్యమన్నారు. 454 మంది టీడీపీ తరపున బీటెక్ రవికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు పథకాల కారణంగా వైసీ పీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా టీడీపీకి ఓటు వేస్తారన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications