'జగన్ దూరమవుతున్నారు, పులివెందుల నడివీధిలో 4వేలమంది రాలేదు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి సవాల్ చేశారు.
పులివెందుల నియోజకవర్గానికి జగన్ చేసింది ఏమీ లేదన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో పులివెందుల నడివీధిలో సమావేశం నిర్వహిస్తే 4వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
గండికోట నుంచి పైడిపాళెంకు నీరు మళ్లించే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైన సమావేశానికి యాభై వేల మంది ప్రజలు హాజరయ్యారన్నారు. జగన్ ప్రజల విశ్వాసానికి దూరమవుతున్నారన్నారు.

వైయస్ పేరు చెప్పుకొని రాజకీయాలు
తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని ఇంకా రాజకీయాలు సాగిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలం నుంచి గండికోటకు నీరు వస్తాయని తెలిసే రైతులను మభ్యపెట్టేందుకు పులివెందులలో ధర్నా చేశారన్నారు.

వైసిపి ఎంపీలు రాజీనామా చేస్తే..
జూన్లో వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ అంటున్నారని, రాజీనామా చేస్తే వైసీపీ మళ్లీ గెలవలేదన్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచైనా, కడప పార్లమెంటు నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.

అది జగన్కే చెల్లింది
జగన తీరు సరిగా లేదని సతీష్ రెడ్డి అన్నారు. ఆయన ప్రవర్తనను అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేయడం ద్వారా.. వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్న వారిని సైతం జైలుకు పంపడం జగన్కే చెల్లిందన్నారు.

బీటెక్ రవిదే గెలుపు
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి విజయం తథ్యమన్నారు. 454 మంది టీడీపీ తరపున బీటెక్ రవికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు పథకాల కారణంగా వైసీ పీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా టీడీపీకి ఓటు వేస్తారన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications