Rs.2.34 లక్షలకే సొంత ఇల్లు!
ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసిచూడు.. అనేది పెద్దలు చెప్పే సామెత. ఎందుకంటే ఆ రెండు ఎంతటి మహత్కార్యాలో వారికి తెలుసు కాబట్టి. ఇల్లు కట్టాలి అంటే రూ. లక్షల్లో ఖర్చవుతోంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇంటి నిర్మాణ ఖర్చు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ కు సమీపంలోని రాజేంద్రనగర్ లో NIRD (national institu of rural development and panchayathi raj) లోని రూరల్ టెక్నాలజీ పార్కులో అధికారులు తక్కువ వ్యయంతో ఒక నమూనా ఇంటిని నిర్మించారు. తక్కువ ఖర్చు కావడంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా ఈ రకమైన ఇల్లు నిర్మించుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నమూనా ఇంటి హైలైట్స్
1. పాత రోజుల్లో కట్టినట్లుగా పునాదిని రాళ్లతో నిర్మించారు.
2. పునాది నుంచే స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రిని ఉపయోగించుకోవచ్చు.
3. ఇటుకలు, సిమెంటు వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు గోడలను ర్యాట్ ట్రాప్ బాండ్ పద్ధతిలో కట్టారు.
4. ప్రముఖ ఆర్కిటెక్ట్ లారీబేకర్ కేరళలో 1970లో ఈ తరహా నిర్మాణాన్ని చేపట్టారు. దాంతో అప్పటినుంచి ఆయన పేరుతో ఈ మోడల్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఖర్చు తగ్గించేందుకు ఫ్లైయాష్ ఇటుకలను వాడారు.
5. పిల్లర్ స్లాబ్ రూఫ్ నిర్మించారు. పెంకులతో నిర్మించే శ్లాబు ఇది. దీన్నే లారీబేకర్ డిజైన్ అంటారు. కేరళలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల వేసవిలోను చల్లదనం ఉంటుంది. సిమెంటు, కాంక్రీట్ తక్కువగా వాడతారు.
6. పాతరోజుల్లో కట్టినట్లుగా ఇంటి లోపల గోడల ప్లాస్టరింగ్ మట్టితో కట్టారు.

బయట ప్లాస్టరింగ్ ఉండదు
1. బయట ప్లాస్టరింగ్ చేయరు. ఫ్లైయాష్ ఇటుకలు కాబట్టి ఎటువంటి ప్లాస్టరింగ్ అవసరంలేదు.
2. ఆవుపేడతో తయారుచేసిన ప్రకృతిక్ రంగులు వాడారు.
3. రెండు రంగుల్లో లభించే తాండూరు బండలను గచ్చు కోసం ఉపయోగించారు. దీనివల్ల ఫ్లోరింగ్ అందంగా ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.
4. ఒక్కో చదరపు అడుగుకు రూ.683 ఖర్చైందని NIRD అధికారులు వెల్లడించారు.

సౌరవిద్యత్తు ఏర్పాటు చేసుకోవచ్చు
1. ఈ నమూనా ఇంటిపై 2 కిలోవాట్ సౌరపలకలను ఏర్పాటు చేయడంతో ఇంటి అవసరాలకు కావాల్సిన విద్యుత్తు ఇంటి పై నుంచే ఉత్పత్తి అవుతుంటుంది. ప్రతిరోజు 8 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. చిన్న ఇంటికైతే సంవత్సరం పొడవునా ప్రతిరోజు 4 యూనిట్లకు మించి అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు.
2. ఈ నమూనా ఇంట్లో ఎల్ఈడీ లైట్లు, విద్యుత్తు ఆదా చేసే ఫ్యాన్లు, సౌర విద్యుత్తుతో నడిచే స్టవ్ ను అమర్చారు. రోజుకు 2 యూనిట్లకు మించి ఖర్చు కాదు. వేసవికాలంలో అయితే కాస్తంత ఎక్కువ వినియోగం ఉంటుంది.
3. మిగిలిన యూనిట్లను నెట్ మీటర్ ద్వారా గ్రిడ్ కు అనుసంధానించడంద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం యూనిట్ కు రూ. 4.19 చొప్పున డిస్కం వినియోగదారులకు చెల్లిస్తోంది. ప్రతి 6 నెలలకు ఈ నగదును చెల్లిస్తారు.
4. ఇంటిపై ఈ సౌరవిద్యుత్తు యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.రూ.1.06 లక్షలు అవుతుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications