పాము విషంతో భార్యను చంపిన భర్త
రాజమండ్రి : మండపేట మండలం ఏడిదలో విషమిచ్చి భార్యను చంపిన దారుణ ఘటన సోమవారం నాడు చోటుచేసుకొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మండపేట మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన మొగల్ సాహెబ్ తన భార్య వహీదాకు పాము విషాన్ని ఇంజక్షన్ రూపంలో ఇచ్చి హాత్య చేశాడు. భార్య తనను అనుమానిస్తోందనే నెపంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తోంది.
మొగల్ సాహెచ్ సీతానగరంలోని పాములపట్టే వ్యక్తి నుండి విషాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషాన్ని ఇంజక్షన్ రూపంలో భార్య వహీదాకు ఇచ్చాడు.ఈ విషం శరీరంలోకి ప్రవేశించడంతో వహీదా మరణించింది.
తనను అనుమానిస్తూ ఇబ్బందులకు గురిచేయడం వల్ల మొగల్ సాహెబ్ ఈ హాత్య చేశారని సమాచారం.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొగల్ సాహెబ్ కు ఈ ఘటనలో ఎవరైనా సహాకరించారా.....ఎందుకు ఈ దురాఘాతానికి పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.