వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడిగితే డబ్బివ్వలేదని ప్రియురాలి కూతుర్ని చంపేశాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Mom's lover kills girl
హైదరాబాద్: జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని ప్రియురాలి కూతురును చంపిన దారుణ సంఘటన హైదరాబాదులో జరిగింది. ఈ సంఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన సయ్యద్ ఆరీఫ్ నగరానికి వచ్చాడు. ఓ యునానీ వైద్యుడి వద్ద పని చేశాడు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత ఐదేళ్ల క్రితం భర్త నుండి దూరమై పదేళ్ల కూతురు పుష్పతో కలిసి ఉంటోంది. మూడేళ్ల క్రితం సయ్యద్ ఆరీఫ్‌తో ఏర్పడిన పరిచయం సహజీవనంగా మారింది. గత సంవత్సరం ఇద్దరు కలిసి ఓ ఇంట్లో దిగారు. కవిత ఓ వంటవాడి వద్ద సహాయకురాలిగా పని చేస్తోంది.

కవిత ప్రియుడు సయ్యద్ ఆరీఫ్ జల్సాలకు అలవాటు పడి ప్రియురాలును డబ్బుల కోసం వేధించేవాడు. ఆయన చిత్రహింసలు పెడుతుండటంతో ఇటీవల స్వగ్రామానికి వెళ్లింది. సోమవారం ఫోనులో కవితను డబ్బులు కావాలని, లేదంటే కూతురు పుష్పను చంపుతానని బెదిరించాడు.

దీంతో పక్కింటి ద్వారా ఆమె కొంత మొత్తం ఇప్పించింది. ఇంకా డబ్బులు కావాలని పట్టుబట్టాడు. ఎంతగా ఫోన్ చేసినా కవిత నుండి సమాధానం రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సయ్యద్ ఆరీఫ్ ప్రియురాలు కవిత కూతురు పుష్ప మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పుష్ప వయస్సు పదేళ్లు.

English summary

 A 10 year old girl was killed by a man who was having a sexual affair with her mother at Reddy Colony in Saidabad on Monday. Police said that the killer choked her to death after an argument with her mother. Later, he surrendered to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X