అడిగితే డబ్బివ్వలేదని ప్రియురాలి కూతుర్ని చంపేశాడు
రంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత ఐదేళ్ల క్రితం భర్త నుండి దూరమై పదేళ్ల కూతురు పుష్పతో కలిసి ఉంటోంది. మూడేళ్ల క్రితం సయ్యద్ ఆరీఫ్తో ఏర్పడిన పరిచయం సహజీవనంగా మారింది. గత సంవత్సరం ఇద్దరు కలిసి ఓ ఇంట్లో దిగారు. కవిత ఓ వంటవాడి వద్ద సహాయకురాలిగా పని చేస్తోంది.
కవిత ప్రియుడు సయ్యద్ ఆరీఫ్ జల్సాలకు అలవాటు పడి ప్రియురాలును డబ్బుల కోసం వేధించేవాడు. ఆయన చిత్రహింసలు పెడుతుండటంతో ఇటీవల స్వగ్రామానికి వెళ్లింది. సోమవారం ఫోనులో కవితను డబ్బులు కావాలని, లేదంటే కూతురు పుష్పను చంపుతానని బెదిరించాడు.
దీంతో పక్కింటి ద్వారా ఆమె కొంత మొత్తం ఇప్పించింది. ఇంకా డబ్బులు కావాలని పట్టుబట్టాడు. ఎంతగా ఫోన్ చేసినా కవిత నుండి సమాధానం రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సయ్యద్ ఆరీఫ్ ప్రియురాలు కవిత కూతురు పుష్ప మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పుష్ప వయస్సు పదేళ్లు.