స్మార్ట్ సిటీస్: తెలంగాణలో 2, ఏపీకి ఒకటి ఎక్కువ
హైదరాబాద్: దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయటంతోపాటు 476 పట్టణాలను అటల్ పట్టణ నవీకరణ పథకం కింద పూర్తిస్థాయిలో పునః నిర్మించడానికి రూపొందించిన రెండు ప్రతిష్టాత్మక పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో పథకాలు అమలవుతాయి.
ఈ పథకాల్లో భాగంగా స్మార్ట్ సిటీస్ అభివృద్ధి చేయడానిక ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధిక సంఖ్యలో నగరాలకు అవకాశం లభించనుంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్రలున్నాయి. స్మార్ట్సిటీల కింద ఆంధ్ర ప్రదేశ్లో మూడు, తెలంగాణలో రెండు నగరాలు ఎంపిక చేశారు.
వీటితో పాటు 476ల 'అమృత్' నగరాలుగా గుర్తించింది. ఈ పథకాల్లో భాగంగా ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనల్లో ఉన్న నగరాల వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సీనియర్ అధికారి వివరించారు. లక్షకుమించి జనాభా ఉన్న పట్టణాలను ప్రతిఒక్క రంగంలో సమగ్రంగా అభివృద్ధి చేయటానికి రూపొందించిన అటల్ పట్టణ నవీకరణ పథకం కింద ఏపీలో 31, తెలంగాణలో 15 పట్టణాలు ఎంపికయ్యాయి.
ఉత్తరప్రదేశ్ నుంచి 13 నగరాలను 'స్మార్ట్ సీటీస్'గా తీర్చిదిద్దనున్నారు. అలాగే, 'అమృత్' పథకం కింద అభివృద్ధి పరిచేందుకు 64 నగరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. తమిళనాడు నుంచి స్మార్ట్ సిటీస్ పథకం కింద 12, 'అమృత్' కింద 33 నగరాలను అభివృద్ధి పరుస్తారు.
మహారాష్ట్ర నుంచి స్మార్ట్ సిటీస్ పథకం కింద 10, 'అమృత్' కింద 37 నగరాలను గుర్తించారు. గుజరాత్, కర్ణాటకల్లో 6 నగరాల చొప్పున 'స్మార్ట్ సిటిస్' పథకం కింద, 'అమృత్' పరిథిలో 31, 21 నగరాలను గుర్తించారు. ఢీల్లీకి మాత్రం ఈ రెండు పథకాల కింద ఒక్కోనగరాన్ని మాత్రమే ప్రతిపాదించే అవకాశం లభించింది.

దేశంలోని 12 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్లు ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టనున్న పట్టణాల అభివృద్ధి పథకాల్లో ప్రముఖపాత్ర పోషించనున్నాయి.
వివిధ రంగాల్లో ఆరితేరిన నిపుణల బృందం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని స్మార్ట్ సిటీలను ఎంపికచేసింది. 2015-16లో అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క రంగంలో అగ్రగామిగా నిలిచే 20 నగరాలను మాత్రమే స్మార్ట్సిటీ పథకానికి ఎంపిక చేసి నిధులుకేటాయిస్తారు. మిగిలిన నగరాలకు రెండోదశలో నిధులు కేటాయింపు జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్లో అమృత్ పట్టణాలు (31)
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, కడప, అనంతపురం, విజయనగరం, ఏలూరు, ప్రొద్దుటూరు, నంద్యాల, ఒంగోలు, ఆదోనీ, మదనపల్లి, చిత్తూరు, మచిలీపట్నం, తెనాలి, చీరాల, హిందూపురం, శ్రీకాకుళం, భీమవరం, ధర్మవరం, గుంతకల్లు, గుడివాడ, నర్సరావుపేట, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట ఉన్నాయి.
తెలంగాణలో అమృత్ పట్టణాలు (15)
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మహబూబ్నగర్, మంచిర్యాల, నల్లగొండ, ఆదిలాబాద్, కొత్తగొడెం, సిద్ధిపేట, సూర్యాపేట, మిర్యాలగూడ, జగిత్యాల ఉన్నాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications