టీడీపీ అనుకూలంగా ప్రశాంత్ కిశోర్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కారణం?
Perni Nani: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీకి చెందిన హిందూపురం లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోతోన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదని అన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని, 9వ తేదీన వైఎస్ జగన్.. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, వరుణదేవుడు తమ పార్టీలోనే కొనసాగుతున్నాడని గోరంట్ల మాధవ్ చెప్పారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతోండటం వల్లే వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తోన్న ప్రచారంలో అర్థం లేదని కొట్టిపారేశారు.
ఎన్నికల సమయంలో ఓ పార్టీలో చేరాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చెల్లలేదని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పే మాటలు శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టుగా మారిందని చురకలు అంటించారు. ప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారని, వాటిని ప్రోత్సహించడానికే ఆయనతో సానుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తోన్నారని అన్నారు.
2019లో వచ్చిన ఫలితాలే ఈ సారి కూడా పునరావృతం అవుతాయని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి తేదీ, సమయాన్ని వైఎస్ జగన్ ఫిక్స్ చేశారని, చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో 151కి పైగా, లోక్సభలో 22కు పైగా సీట్లను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications