వైఎస్ వివేకా అలియాస్ షేక్ మహ్మద్ అక్బర్: రెండో భార్య ఫొటోలు వైరల్
వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని, తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని తెలిపారు.
హైదరాబాద్/అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని, తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని తెలిపారు. ఇవ్వాళ ఆయన హైదరాబాద్ లో సీబీఐ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు విచారణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కీలక విషయాలు పక్కన పెట్టి..
వైఎస్ వివేకా హత్యకేసులో చాలా కీలకమైన విషయాలను పక్కన పెట్టి, చిన్న చిన్న అంశాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని అవినాష్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రెండుసార్లు సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. ఈ రెండు విచారణలకు సంబంధించిన పూర్తి వివరాలు, దీనికి సంబంధించిన హార్డ్ డిస్కులను తమకు సమర్పించాలంటూ హైకోర్టు- సీబీఐ అధికారులను ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు.

2011లో వివాహం..
2006 నుంచి వివేకానందరెడ్డికి ఓ యువతితో సంబంధం ఉందని, ఇస్లాం చట్టం ప్రకారం 2011లో పెళ్లి కూడా చేసుకున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఆయన తన పేరును కూడా మార్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకుని ఆ యువతిని పెళ్లాడారని అన్నారు. వివేకానందరెడ్డి- ఆ యువతి ఓ బాబు పుట్టాడని, షేక్ షెహెన్ షా అని పేరు పెట్టారని వివరించారు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా ఆ బాబును ప్రకటించాలనే ఉద్దేశంలో వివేకా ఉన్నారని చెప్పారు.

ఆస్తి బదలాయింపు..
తన ఆస్తిని వివేకానందరెడ్డి తన రెండో భార్య, కుమారుడు షెహెన్ షా పేరు మీదికి బదలాయించేలా నోటరీ చేసిన వీలునామా, కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నాయని అన్నారు. ఈ సమయంలో వివేకాను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశం ఎవరికి ఉందని ప్రశ్నించారు. మర్డర్ ఫర్ గెయిన్.. ఏదో లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పాల్పడ్డారని అవినాష్ రెడ్డి వివరించారు. ఈ విషయాన్ని తాను కోర్టు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

రూ.8 కోట్లు..
ఎనిమిది కోట్ల రూపాయల పంపకాల మీద గొడవలు జరిగాయనే విషయాన్ని అప్రూవర్ స్టేట్ మెంట్ లో ఉందని అవినాష్ రెడ్డి తెలిపారు. ఆ మొత్తాన్ని తానే తీసుకుంటానని వివేకా, చెరి సగం కోసం పట్టుబట్టడం.. ఈ హత్యకు దారి తీసినట్టుగా పొందుపర్చారని అన్నారు. బెంగళూరు ప్రాపర్టీ విషయంలో ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షుల వద్ద సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ నమోదు చేశారని చెప్పారు. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఓ లెటర్ ను ఇన్ని రోజులు దాచి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు

లెటర్ దాచి పెట్టారు.
వైఎస్ సునీతారెడ్డి భర్త రాజశేఖర్ ఈ లెటర్ ను దాచి పెట్టారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆ లెటర్ లో ఉన్న వివరాలేవీ బయట పెట్టొద్దంటూ సూచించారని, ఈ విషయం పోలీసులకు కూడా తెలియదని అన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు సంఘటన స్థలానికి వెంటనే బయలుదేరి వెళ్లాలని తనను పంపించారని, లెటర్ ఉందనే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని వివరించారు. ఇదంతా కుట్ర కాదా? అని నిలదీశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications