సీఎం చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ..!!
రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదంటూ సీబీఐ అధికారులు ఏకంగా సుప్రీంకోర్టుకు నివేదిక అందించిన తరువాత వరుసగా దాడుల ఘటనలు సంభవిస్తోన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబ, జోగి రమేష్, విడదల రజినిపై జరుగుతోన్న దాడులు దీనికి ఉదాహరణ. అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపైకీ దాడులకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెరమీదికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ముద్రగడ ఆరోపించారు. దీన్ని- రాక్షస, విధ్వంసకర పాలనగా అభివర్ణించారు. దమనకాండ కన్నా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని ప్రధానమంత్రిని కోరాలని చంద్రబాబుకు సూచించారు.

ఎమర్జెన్నీని విధించడం ద్వారా ప్రతిపక్షాన్ని చంద్రబాబు పదవీ కాలం ముగిసేంత వరకు జైలులో పెట్టడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేష్ ను దాడులు చేయడం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి పరిస్థితులు లేవని ముద్రగడ పేర్కొన్నారు.
తిరుమల లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో గతంలో చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్దమని తేలిపోవడం వల్ల అ అబద్దాన్ని కప్పి పుచ్చుకోవడానికి, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ దాడులు జరుగుతున్నట్లు భావిస్తున్నానని అన్నారు. ఒక అబద్దానికి 100 అబద్దాలు చెప్పినా సరి చేయలేమని హితవు పలికారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చెప్పిన అబద్ధానికి ఆయన, టీడీపీ ఎంతో నష్ట పోయిందని ముద్రగడ అన్నారు.
కల్తీ గురించి తాను గతంలో చెప్పింది పొరపాటు అని ఒప్పుకొని ఉంటే చాలా బాగుండేదని, చంద్రబాబు మీద గౌరవం పెరిగేదని చెప్పారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని, తనపై జరిగిన దాడి తరహాలోనే అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ముద్రగడ గుర్తు చేశారు.
కాపు కులానికి రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు మొండి చేయి చూపించిన విషయం అందరికి తెలిసిందేనని, ఉపముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమతో కాపు సామాజిక వర్గం మొత్తం చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు అభిప్రాయపడుతున్నానని చెప్పారు. పవన్ కల్యాణ్ మద్దతు వల్లే చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు డీలా పడిపోయి టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని, అయినప్పటికీ అదే కాపు కులం మీద రగిలిపోవడం సరికాదని చెప్పారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications