'చంద్రబాబుపై కేసు పెడితే.. అలా చేయడానికి నేను సిద్దం'
తూర్పు గోదావరి : ఓవైపు హైకోర్టు అనుమతులిచ్చినా.. ప్రభుత్వం మాత్రం ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో జాప్యం చేస్తూ వస్తున్న ప్రభుత్వంపై.. కాపు నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా అది మరింత రెట్టించే అవకాశముంది.
తాజాగా అనకాపల్లి రైల్వే కోర్టుకు హాజరవ్వాలంటూ ముద్రగడకు నోటీసులు అందడంతో.. ముద్రగడ వర్సెస్ ప్రభుత్వ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నోటిసులపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రగడ. తాటాకు చప్పుళ్లకు జడిసేది లేదని తేల్చి చెప్పారు. పుష్కరాల్లో జరిగిన ప్రాణ నష్టంపై సీఎం చంద్రబాబు మీద కేసు నమోదు చేస్తే.. తమకు సంబంధం లేకపోయినా తునికి ఘటనకు బాధ్యత వహించడానికి సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు.

ఒకవేళ డీజీపీ అలాంటి నిర్ణయమే గనుక తీసుకుంటే.. తన సొంత ఆస్తులు అమ్మి అయినా సరే తుని ఘటనకు నష్ట పరిహారం చెల్లిస్తానని సవాల్ విసిరారు ముద్రగడ. కేవలం కాపుల విషయంలోనే ప్రభుత్వానికి ఆంక్షలు, నిబంధనలు గుర్తొస్తున్నాయని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్-30 జీవిత కాలం అమలులో ఉంటుందా అని ప్రశ్నించారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications