Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మచిలీపట్నంలో వైసీపీ నేత కుమారుడిపై హత్యాయత్నం ... చేసింది ఎవరంటే

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. వైసిపి నేత , మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకు ఖాదర్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లో ఉన్న సమయంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. బాధితుని పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మచిలీపట్నం వైసీపీ నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకు ఖాదర్ పై ఆయన భార్యనే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది . కుటుంబ కలహాల నేపధ్యంలోనే భార్య ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా సమాచారం .ఇక సాలు విషయానికి వస్తే ఖాదర్ 14 ఏళ్ల క్రితం షేక్ నదియాను వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆయన తన భార్య నదియాకు తెలియకుండా ఆమె సొంత చెల్లెల్ని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం విషయంలో నదియా, ఖాదర్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి .

murder attempt on YCP leaders son in Machilipatnam

దీంతో భార్య నదియా ఖాదర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిందని భావిస్తున్నారు. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రగాయాలతో ఉన్న ఖాదర్ ఇప్పుడు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ప్రమేయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

    Moka Bhaskar Rao హత్య కేసులో మాజీ మంత్రి Kollu Ravindra ను అరెస్ట్ ! || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+