తిరుమల శ్రీవారికి ముస్లీం భక్తుడి భారీ విరాళం, 'ప్రత్యేక దర్శనం రద్దు'
చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు విరాళం ఇచ్చారు. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఓ ముస్లిం భక్తుడు శ్రీవారికి కూరగాయల రథాన్ని విరాళంగా ఇచ్చారు. అతని పేరు అబ్దుల్ ఘనీ.
ఇతడు శ్రీవారి భక్తుడు. రూ.30 లక్షల విలువ చేసే కూరగాయల రథాన్ని తయారు చేయించి అతను శ్రీవారి ఆలయం ఎదుటకు తీసుకొచ్చారు. రథానికి పూజలు నిర్వహించి దేవస్థానం రవాణా శాఖకు అందించారు. ఈ లారీని కూరగాయల రవాణాకు వినియోగించనున్నారు.

ఈ సందర్భంగా అబ్దుల్ ఘనీని తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ తదితరులు సత్కరించారు. అబ్దుల్ ఘనీ గతంలో తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు వితరణగా అందించారు.
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపిల ప్రత్యేక దర్శనం సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు తీసుకు వచ్చినా అనుమతించేది లేదని చెబుతున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి 3వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో సాంబశివ రావు వెల్లడించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications