ఓ ముఖం పెట్టుకుని పార్టీ పెడ్తారు: కిరణ్ రెడ్డిపై మైసురా

తెలుగు ప్రజలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపినపుడు ఆగమేఘాల మీద ఆ బిల్లును అసెంబ్లీలో కిరణ్కుమార్రెడ్డి ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం కోరిన సమాచారాన్ని సమగ్రంగా అందించి, రాష్ట్ర విభజన ప్రక్రియను కిరణ్కుమార్రెడ్డి సులభతరం చేశారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సమైక్యవాదాన్ని వినిపిస్తామంటే అర్ధంలేదని మైసూరారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించిందని అభిప్రాయపడ్డారు. రానున్న మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మైసూరారెడ్డి పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆర్టికల్ 3ను రాజ్యాంగ నిర్మాతలు రూపొందిస్తే, యుపిఏ ప్రభుత్వం దాన్ని ప్రయోగించి దేశ సమగ్రతను, ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తోందన్నారు.
సమర్ధవంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ తెర వెనుక ఒకటి, తెర ముందు మరొకటిగా నాటకాలాడుతోందన్నారు. కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం బిజెపి కూడా అలాగే వ్యవహరిస్తోందన్నారు. అధికారపక్షంతో ప్రతిపక్షాలు మ్యాచ్ఫిక్సింగ్ చేసుకోవటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు.












Click it and Unblock the Notifications